బిగ్‌బాస్‌పై గీతా మాధురి సెటైర్..

  • IndiaGlitz, [Thursday,October 08 2020]

బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షో ముగిశాక కొందరు ఆరోపణలు గుప్పిస్తుంటారు.. మరికొందరు ఎడిటింగ్‌లో తమను మాటలను వక్రీకరించి చూపించారంటూ మండిపడుతుంటారు. ఇంకొందరు సెటైర్లు వేస్తుంటారు.. సింగర్ గీతా మాధురి మాత్రం సెటైర్ వేసింది. బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొన్న గీతా మాధురి రన్నరప్‌గా నిలిచింది. ఈ షో సమయంలో నడిచిన వివాదాలు మరే సీజన్‌లోనూ నడవలేదు. కొందరైతే ఏకంగా హీరో నాని హోస్టింగ్‌ను దుయ్యబట్టి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షో మొత్తం కాంట్రవర్శీలకు కేంద్రంగా మారిపోయింది.

బిగ్‌బాస్ సీజన్ 2 నుంచి బయటకు వచ్చిన అనంతరం.. గీతా మాధురికి తల్లిగా ప్రమోషన్ లభించిన విషయం తెలిసిందే. అయితే తల్లయ్యాక గీత పూర్తిగా మారిపోయింది. బాగా ఫ్యాట్ అయిపోయింది. అయితే షో నుంచి బయటకు వచ్చిన అనంతరం సెల్ఫీ తీసుకున్న గీతా మాధురి ఆ ఫోటోను తాజాగా పోస్ట్ చేసింది. ఇంత వరకూ ఓకే కానీ పెట్టిన కామెంటే సెటైరికల్‌గా ఉంది. ఈ ఫోటో చాలా సన్నగా కనిపిస్తున్న గీతా మాధురి.. ‘రెండు సంవత్సరాల క్రితం ఫొటో. బరువు తగ్గించుకుని సన్నగా అవ్వాలనుకుంటే బిగ్‌బాస్‌కు వెళ్లమని మీకు సలహా ఇస్తా’ అని గీత కామెంట్ చేసింది.

More News

థియేటర్లు తెరిచాక రిలీజ్ కాబోయే తొలి సినిమా ఏదంటే...

సినిమా షూటింగ్‌లు.. ప్రతి ఒక్క హీరోది ఏదో ఒక సినిమా.. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలు సైతం కవర్ చేస్తుంటారు.

అవినాష్ రాజేసిన నిప్పు బాగా మండింది..

ఇవాళ షో అంతా ఫన్నీ ఫన్నీగా సాగిపోయింది. అవినాష్ చాలా ఇంటెలిజెంట్‌గా తన సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేస్తుండటంతో ఆ కారణంగా..

విజయ్ సేతుపతి-జయరామ్ హీరోలుగా నటించిన 'రేడియో మాధవ్' ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా 'మార్కొని మతాయ్'. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు.

రామ్ చరణ్ హోస్ట్‌గా డ్యాన్స్ టాలెంట్ షో.. ప్రత్యేకత ఏంటంటే..

రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌, ‘బీ పాజిటివ్’ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌‌‌గా ఉపాసన ఒక సొంత ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.

40 ఏళ్ల క్రితం టైటిల్‌తో క‌మ‌ల్ హాస‌న్‌..!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా `ఖైదీ`తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన లొకేష్ క‌న‌రాజ్ ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.