కేరళకు 'గీత గోవిందం' నిర్మాత విరాళం...
- IndiaGlitz, [Thursday,August 16 2018]
నిన్న తెలుగులో విడుదలైన 'గీత గోవిందం' తిరుగులేని విజయాన్ని సాధించింది. సూపర్హిట్ టాక్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. తొలిరోజునే 16 కోట్ల గ్రాస్ను సాధించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకుడు కాగా.. బన్నివాస్ నిర్మాత.
ఈ సినిమాలో కేరళలో కూడా విడుదలైంది. అయితే కేరళ వరదల్లో చిక్కుకుంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంలో.. బన్నివాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు.
కేరళలో ఈ సినిమాకు వచ్చే షేర్ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేస్తామని ప్రకటించారు.అలాగే చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.