ఊపిరి కి ఇన్ ట‌చ్ బుల్స్ నిర్మాత అభినంద‌న‌

  • IndiaGlitz, [Thursday,March 31 2016]

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా క‌లిసి న‌టించిన ఊపిరి చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిస్తుందో తెలిసిందే. రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో బ్లాక్ బ‌ష్ట‌ర్ దిశ‌గా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఊపిరి సినిమా ఇన్ ట‌చ్ బుల్స్ అనే ఫ్రెంచ్ మూవీకి అఫిషియ‌ల్ రీమేక్ అనే విష‌యం తెలిసిందే. ఇన్ ట‌చ్ బుల్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ గ‌మోంట్ ఊపిరి చిత్రాన్ని ప్ర‌శంసించ‌డం విశేషం. ప్ర‌పంచంలోనే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గ‌మోంట్. ఈ సంస్థ నిర్మించిన ఇన్ ట‌చ్ బుల్స్ మూవీ ఆల్ టైమ్ హిట్ మూవీస్ లో ఒక‌టిగా నిలిచింది.

ఇన్ ట‌చ్ బుల్స్ నిర్మాణ సంస్థ ఊపిరి చిత్రం గురించి స్పందిస్తూ...మా సంస్థ నుంచి ఫ‌స్ట్ ఇండియ‌న్ రీమేక్, అలాగే ఇన్ ట‌చ్ బుల్స్ సినిమాకి కూడా ఫ‌స్ట్ ఇండియ‌న్ రీమేక్ ఊపిరి చిత్రం కావ‌డం సంతోషంగా ఉంది. ఇంత త‌క్కువ టైమ్ లోనే మంచి క్వాలిటీతో ఊపిరి చిత్రాన్ని నిర్మించిన పి.వి.పి ని అభినందిస్తున్నాం అంటూ త‌మ సంతోషాన్ని పంచుకుంది ఫ్రెంచ్ ఇన్ ట‌చ్ బుల్ నిర్మాణ సంస్థ గ‌మోంట్. ఒక తెలుగు సినిమా గురించి ఫ్రెంచ్ నిర్మాణ సంస్థ మాట్లాడ‌డం అంటే నిజంగా గ్రేట్.

More News

మంచు సోదరులిద్దరికీ కీలకమే

మోహన్ బాబు నటవారసులుగా పరిచయమైనా..తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నారు మంచు సోదరులు విష్ణు,మనోజ్.

తమన్నా, ప్రభుదేవా కాంబినేషన్‌లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో 'అభినేత్రి'

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుķ

గుమ్మడికాయ కొట్టుకున్న 'బంతిపూల జానకి'

కొబ్బరికాయ కొట్టడంతో సినిమా షూటింగ్ ప్రారంభించి.. షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టడం అన్నది  చిత్ర పరిశ్రమలో ఆనవాయితీ అన్న విషయం తెలిసిందే.

'ఊపిరి' మాలో నమ్మకాన్ని మరింత పెంచింది - నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున,‘ఆవారా’కార్తీ,మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో రూపొందిన చిత్రం'ఊపిరి'.

'అలా మొద‌లైంది' త‌రువాత మ‌రోసారి..

పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న‌ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న న‌టి నిత్యా మీన‌న్‌. రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే న‌టిగా ఈ కేర‌ళ కుట్టి పేరు తెచ్చుకుంది.  అలాంటి నిత్యా తెలుగులో న‌టించిన తొలి చిత్రం 'అలా మొద‌లైంది'. ఆ సినిమా ఆమెకి మ‌రిన్ని మంచి అవ‌కాశాల‌తో పాటు నంది అవార్డుని సైతం అందించింది.