టాకీపార్ట్ పూర్తి చేసుకున్న 'గరమ్'

  • IndiaGlitz, [Monday,September 14 2015]

సాయికుమార్ తనయుడు ఆది, హార్ట్ ఎటాక్' ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా గరమ్' చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. ప్రస్తుతం సినిమా టాకీపార్ట్ ను పూర్తి చేసుకుంది. పెళ్ళైన కొత్తలో ఫేమ్ మదన్ ఈచిత్రానికి దర్శకుడు. వచ్చే నెల నుండి పాటల చిత్రీకరణ ప్రారంభమవుతుందట.

ఆగస్త్య ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టాకీతో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుందని టాక్. సినిమా చాలా బాగా వస్తుందని యూనిట్ చాలా హ్యపీగా ఉన్నారట. ఈ సినిమాని సాయికుమార్ నిర్మిస్తుండటం విశేషం.