అధ్యక్ష హోదాలో కొహ్లీతో దాదా తొలి మీట్!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అలియాస్ బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. బీసీసీఐ అధ్యక్షుడి కోసం జరిగిన ఎన్నికల్లో కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. బుధవారం నాడు బీసీసీఐ కార్యాలయంలో దాదా బాధ్యతలు స్వీకరించారు.

గంగూలితో పాటు వీళ్లు కూడా..!

సెక్రటరీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా
కోశాధికారి: మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ సింగ్ ధుమాల్
ఉపాధ్యక్షుడు: మాహిమ్ వర్మ
జాయింట్ సెక్రటరీ : కేరళకు చెందిన జయేష్ జార్జ్

రేపు కొహ్లీతో భేటీ!
ఈ సందర్భంగా అధ్యక్ష హోదాలో మీడియాతో మాట్లాడిన గంగూలి.. కోహ్లీతో రేపు అనగా గురువారం సమావేశమవుతానని చెప్పారు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ప్రధానమైన వ్యక్తి కోహ్లినే అని.. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అపూర్వ విజయాలను సాధించారన్నారు. ప్రపంచంలోనే టీమిండియాను మేటి జట్టుగా చేయలనేది కోహ్లి తాపత్రయమన్నారు. ఐసీసీ నుంచి భారత్‌కు రావాల్సిన బకాయిలను రాబడతామని గంగూలీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే రేపు జరగనున్న భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More News

రాజధానిపై బొత్స మరోసారి కామెంట్స్.. కలకలం!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

రూ. 25 లక్షల చిరుతిండిపై లోకేష్ రియాక్షన్!

ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రి హోదాలో గట్టిగా మేసేశారని...

‘ఖైదీ’ సెన్సార్‌ పూర్తి , అక్టోబర్‌ 25 విడుదల

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో

`విజిల్` చిత్రాన్ని మ‌హిళ‌ల‌కు అంకిత‌మిస్తున్నాను - డైరెక్ట‌ర్ అట్లీ

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `విజిల్‌``. పోలీస్‌(తెరి), అదిరింది(మెర్స‌ల్‌) వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల త‌ర్వాత విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో

బాబూ.. రాజీనామా చేసి కుప్పంలో గెలవండి చూద్దాం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.