మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్

  • IndiaGlitz, [Friday,July 10 2020]

కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. శుక్రవారం ఉదయం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వికాస్ దూబేను కాల్చి చంపేశారు. భారీ వర్షం కారణంగా వికాస్ దూబేను తీసుకెళుతున్న వాహనం రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదవశాత్తు బోల్తా పడిందని.. ఈ క్రమంలోనే దూబే పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు దూబేను కాల్చి చంపేశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దూబే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడిన ప్రదేశంలో కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

కాగా వికాస్ దూబేను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో పోలీసులు దూబేను పట్టుకున్నారు. నగరంలోని మహంకాళి దేవాలయంలో పూజలు చేసేందుకు దూబే రావడంతో అక్కడి గార్డు.. దూబేను గుర్తించి ఎస్పీకి సమాచారం అందించాడు. దీంతో ఉజ్జయిని పోలీసులు వెంటనే అమ్మవారి దేవాలయానికి వెళ్లి దూబేను అరెస్ట్ చేశారు.