లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్

  • IndiaGlitz, [Sunday,December 10 2017]

సుప్రసిద్ధ నటీమణి గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా అందలాన్నందుకొన్న గౌతమి ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ ను సైతం జయించి, తనలా మరెవరూ బాధపడకూడదనే దృఢ నిశ్చయంతో "లైఫ్ ఎగైన్" ఫౌండేషన్ ను ప్రారంభించారు.

నేడు (డిసెంబర్ 10న) స్టార్ హాస్పిటల్స్ సౌజన్యంతో లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ హైదరాబాద్ లోని మైత్రీవనంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాజకీయవేత్త జయప్రకాష్ నారాయణ్, నటి గౌతమి, సీనియర్ ఆర్టిస్ట్ సన, డాక్టర్ హైమారెడ్డి, డాక్టర్ నవీన్, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సోషల్ యాక్టివిస్ట్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ శివ, డాక్టర్ గీత, డాక్టర్ భార్గవి, డాక్టర్ కృష్ణ పుట్టపర్తి, యాక్టర్ కమ్ యాంకర్ టి.ఎన్. ఆర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటి గౌతమి మాట్లాడుతూ.. "మనిషి ఆనందంగా బ్రతకడానికి కావాల్సింది చదువు, ఆరోగ్యం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు, కానీ ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, మన ఆరోగ్యం పాడైంది అంటే దానికి కారణం మనమే. ఈ విధమైన ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ప్రతి చోట నిర్వహించలేకపోవచ్చు, కానీ మనిషి బ్రతకాల్సింది సమస్యలతో, రోగాలతో కాదు సుఖసంతోషాలతో. ఈ మెడికల్ క్యాంప్ ను అందరూ సరిగా వినియోగించుకొని.. ఎవరికైనా కుదిరితే వారు కూడా సరైన హాస్పిటల్స్ అందుబాటులోలేనివారి కోసం హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలని కోరుతున్నాను. ఈ క్యాంప్ ను ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించిన "లైఫ్ ఎగైన్" మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు" అన్నారు.

More News

మరో దృశ్యం ఆడియో విడుదల

కట్ల రాజేంద్ర ప్రసాద్, అవంతిక, గౌతమ్ , కోలా మధు సిందూర ముఖ్య పాత్రల్లో కట్ట రాజేంద్ర ప్రసాద్ దర్శకతంలో గంగోత్రి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై శ్రీపతి గంగాదాస్ నిర్మిస్తున్న మరో దృశ్యం చిత్రంలోని పాటలు ఆదివారం ఫిలిం ఛాంబర్ లో  విడుదల అయ్యాయి.

ఈ నెల 15న 'ప్రేమపందెం' విడుదల

ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థల అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబశిమ హీరోుగా, మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా నిర్మించిన చిత్రం 'ప్రేమపందెం'.

దంగ‌ల్ న‌టికి చేదు అనుభవం

సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీమ‌ణులంద‌రూ ఈ మ‌ధ్య త‌మ‌కు ప‌రిశ్ర‌మ‌లో ఎదురైన చేదు అనుభ‌వాల‌పై పెద‌వి విప్పుతున్నారు. ఇదొక హాట్ టాపిక్ అయ్యింది.

కీర్తి.. ఈ సారి త‌క్కువే

తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. మంచి విజ‌యాల‌నే మూట‌గ‌ట్టుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌. నేను శైల‌జతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ చిన్న‌ది.. ఆ త‌రువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని నేను లోక‌ల్‌తో సంద‌డి చేసింది.

మ‌ల్టీస్టార‌ర్ మూవీలో సాయిపల్లవి?

ఫిదాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌వి. ఆ చిత్రంలోని త‌న న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసిన ఈ అమ్మ‌డు.. ప్ర‌స్తుతం నానితో ఎం.సి.ఎ సినిమా చేస్తోంది. డిసెంబ‌ర్ 21న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.