Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కుటుంబసభ్యులు..!

  • IndiaGlitz, [Thursday,May 23 2024]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుడివాడలోని తన స్వగృహంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ అకస్మాత్తుగా సోఫాలో కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. కార్యకర్తలు, గన్‌మెన్లు వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కొడాలి నాని నివాసానికి వచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం నానికి సెలెన్ ఎక్కించిన్నట్లు సమాచారం. దీంతో కొడాలి నాని కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న కొడాలి నాని కుటుంబసభ్యులు హుటాహుటిన గుడివాడ బయలుదేరారు.

కాగా గత రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంలో కొడాలి నాని బిజీబిజీగా పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం గుడివాడలోని తన నివాసంలో ఆయా మండలాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సరళి, ఇతర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో గురువారం నందివాడ మండల వైసీపీ నేతలతో నాని భేటీ అయ్యారు. వారితో చర్చలు జరుపుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. దీంతో నేతలు, ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు. కొడాలి నాని గతంలో కరోనా బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఎంజీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు.

ఇదిలా ఉంటే గుడివాడ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగాయి. గత నాలుగు ఎన్నికల్లో పోటీ అనేది లేకుండా కొడాలి నాని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం గుడివాడలో టీడీపీ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఆ పార్టీ అభ్యర్థి వెనిగెండ్ల రాము నుంచి కొడాలి నాని సరైన పోటీ ఎదుర్కొన్నారు. దీంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం మద్దతుదారులు ఈసారి గుడివాడలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెబుతుండగా.. వైసీపీ సపోర్టర్స్ మాత్రం స్వల్ప మెజార్టీతోనైనా కొడాలి నాని విజయం సాధిస్తారని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఎవరు జెండా పాతుతారో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.

More News

TGSRTC:టీజీఎస్ఆర్టీసీ లోగోపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త పదం టీఎస్‌ నుంచి టీజీగా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే టీజీ పేరును

Ilaiyaraaja:ఇళయరాజా తీవ్ర ఆగ్రహం.. 'మంజుమ్మల్ బాయ్స్' యూనిట్‌కి నోటీసులు

ఇళయరాజా సంగీత ప్రియులకు ఓ వ్యసనం లాంటి వారు. ముఖ్యంగా 80, 90 దశకాల్లో తెలుగు, తమిళ్ సినిమాలకు ఎన్నో గొప్ప పాటలకు సంగీతం ఇచ్చారు.

Pinnelli:పిన్నెల్లి కోసం పోలీసులు ముమ్మర వేట.. ఈసీకి డీజీపీ నివేదిక..

పోలింగ్ ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఘర్షణలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్‌ పోలింగ్ కేంద్రంలో

Bharatiyadu 2:‘భార‌తీయుడు 2’... నుంచి లిరికల్ సాంగ్ ‘శౌర..’ రిలీజ్

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో

Janmabhoomi Express: జన్మభూమి రైలు నుంచి తెగిపోయిన బోగీలు.. తప్పిన పెను ప్రమాదం..

విశాఖపట్నం నుంచి లింగంపల్లి రావాల్సిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరిన కొద్దిసేపటికే నిలిచిపోయింది. ఫ్లాట్‌ఫాం నుంచి మొదలైన రెండు నిమిషాలకే రైలును హుటాహుటిన నిలిపివేయాల్సి వచ్చింది.