రేపు ఉదయం 'గాంధీ' సిబ్బందిపై హెలికాఫ్టర్లతో పూలవర్షం

కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి మరీ యుద్ధం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి పాత్ర ఎనలేనిదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విదేశాలతో పోలిస్తే మనదేశంలోని డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నంబర్‌ వన్‌గా పనిచేస్తున్నారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అందుకే ఇలా కోవిడ్ కట్టడికి విశ్రాంతి లేకుండా పని చేస్తున్న కరోనా వారియర్స్‌కు కృత‌జ్ఞతలు తెలపడానికి భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా.. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై ఆదివారం (మే-03) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం కురిపించనున్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మీడియా ముఖంగా వెల్లడించారు. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, హోం గార్డులు, డెలవరీ బాయ్స్, మీడియాకు కూడా ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గాంధీ ఆస్పత్రిపై..

అయితే ఈ ఖాతాలో తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందికి సంఘీభావంగా ఉదయం 09:30 గంటలకు ఐఏఎఫ్ హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. అయితే ఏపీలో ఏ ఆస్పత్రిలో ఇలా సంఘీభావం ఉంటుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు గగనతల విన్యాసాలు నిర్వహించనున్నామని.. తూర్పున దిబ్రూగఢ్ నుంచి పశ్చిమాన గుజరాత్‌లోని కచ్ వరకు మరో విన్యసాం ఉంటుందని రావత్ తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా బాధితులకు చికిత్స చేసిన ఆస్పత్రులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపిస్తామని శుక్రవారం నాడు మీడియా ముఖంగా తెలిపారు.

More News

వెంకన్నా.. నీ కొండను నువ్వే కాపాడుకో : నారా లోకేశ్

మే-01న టీటీడీ చైర్మన్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

కువైట్‌లో ఉంటున్న భారతీయులకు శుభవార్త..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో స్వరాష్ట్రాలను వదిలి ఇతరదేశాలకు, రాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంటికెళ్లలేక..

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు బన్నీ బంపరాఫర్..!

లవర్ బాయ్ సిద్ధార్థ్, జెనీలియా నటీనటులుగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా హిట్టయిన తర్వాత సినిమా తెరకెక్కించిన భాస్కర్ తన ఇంటిపేరునే

వైద్యులు సూపర్ హీరోలు.. : మహేశ్ బాబు

కరోనా మహమ్మారిపై ముందుండి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్ర‌భాస్ 21... క‌థ సిద్ధం చేసి నాగ్ అశ్విన్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి