విష్ణుకిదే తొలిసారి..

  • IndiaGlitz, [Friday,December 15 2017]

గ‌తంలో మ‌న‌ తెలుగు క‌థానాయ‌కులు సంవత్సరానికి నాలుగు లేదా ఐదు సినిమాల‌తో సంద‌డి చేసేవారు. అయితే.. తర్వాత కాలంలో ఆ ట్రెండ్ మారుతూ వచ్చింది. హీరో ఎవరైనా సరే సంవత్సరానికి ఒక సినిమా రావడం కూడా గగనమైపోయింది. కాని ఇప్పుడిప్పుడే మళ్ళీ టాలీవుడ్లో మార్పులు వస్తున్నాయి. ఏడాదికి రెండు సినిమాలను విడుదలకు చేసేందుకు తెలుగు హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.... త‌న కెరీర్‌లోనే తొలిసారిగా యాక్షన్ హీరో మంచు విష్ణు రెండు వారాల వ్యవధిలో రెండు సినిమాల‌తో తెర‌పై సంద‌డి చేయ‌నున్నారు.

గతంలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో దేనికైనారెడీ', ఆడో రకం ఈడో రకం' వంటి విజయవంతమైన కామెడీ చిత్రాలలో న‌టించిన విష్ణు.. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా ఆచారి అమెరికా యాత్ర' చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నది. అలాగే మోహన్ బాబు నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం గాయత్రి'. శ్రియ నాయికగా నటిస్తున్న ఈ మూవీలో విష్ణు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మదన్ రూపొందిస్తున్నఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అంటే.. రెండు వారాల గ్యాప్‌లో మంచు విష్ణు త‌న అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడ‌న్న‌మాట‌.

More News

శివకాశీపురం సాంగ్ లాంచ్ చేసిన తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్

సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాస్టర్ హరి సమర్పణలో హరీష్ వట్టి కూటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మోహన్ బాబు పులిమామిడి నిర్మిస్తున్న చిత్రం  'శివకాశీపురం'. స్వర్గీయ స్వర చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నారు .

అంజలి ప్రధాన పాత్రలో, రాయ్ లక్ష్మి కీలక పాత్రలో ఆర్ కె స్టూడియోస్ బ్యానర్ ద్విభాషా చిత్రం

గుంటూరు టాకీస్,రాజా మీరు కేక వంటి వినోదాత్మక చిత్రాలను,షూటింగ్ దశలో ఉన్న పవనిజం-2 వంటి చిత్రాలను తెరకెక్కించిన

'బాహుబలి' సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేసిన 'లాయల్‌ ఎల్‌.ఇ.డి.' లైట్స్‌

శ్రీ బాలాజీ వీడియోస్‌ ద్వారా 300కు పైగా తెలుగు సినిమాలను విడుదల చేసిన నిరంజన్‌ పన్సారి వీడియో రంగంలో

'ఎం.సి.ఎ' సెన్సార్ పూర్తి

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'ఎం.సి.ఎ'. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది.

భాయ్ పాత్ర‌లో తేజ్‌...

మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌..ప్ర‌స్తుతం మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సి.క‌ల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.