ఏప్రిల్ మొద‌టివారంలో సుమంత్ 24 ఫ‌స్ట్‌లుక్‌

  • IndiaGlitz, [Wednesday,March 28 2018]

'మ‌ళ్ళీరావా' చిత్రంతో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు కథానాయకుడు సుమంత్. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఆయ‌న బిజీగా మారారు. ఇదిలా ఉంటే.. సుమంత్‌, అంజు కురియన్ జంటగా  ‘ఇదం జగత్’ (పరిశీలనలో ఉన్న పేరు) పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. సుమంత్ కెరీర్‌లో 24వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాతో అనిల్ శ్రీ‌కంఠం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేసే ప్రెస్ ఫొటోగ్రాఫర్‌గా.. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో సుమంత్ కనిపించనున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ప్రీ-లుక్‌ను ఏప్రిల్ 1న, అలాగే.. ఫస్ట్‌లుక్‌ను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అలాగే సినిమాని ఏప్రిల్ ఆఖరి వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సుమంత్ తన 25వ చిత్రాన్ని ప్రారంభించిన‌ విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ ఈ సినిమాకి ‘సుబ్రమణ్యపురం’ అనే పేరుని ఖరారు చేశారు. ఇందులో ఈషా రెబ్బా క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

More News

'పంతం' తో గోపీచంద్ సందేశం

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, హ్యాట్రిక్ విజ‌యాల క‌థానాయిక‌ మెహరీన్ జంటగా నూతన దర్శకుడు కె.చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి) తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’.

#RRR లో విల‌న్‌గా రాజశేఖర్?

నిన్నటి తరం కథానాయకుల్లో కొంతమంది.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

నిర్మాత‌గా మారుతున్న బాబీ...

'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌', 'జై ల‌వ‌కుశ' చిత్రాల‌తో డైరెక్ట‌ర్‌గా త‌న స్టామినాను ప్రూవ్ చేసుకున్న ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబి).

సైరాలో అమితాబ్ లుక్ ఎలా ఉంటుందంటే...

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.

డైరెక్ష‌న్ ఆలోచ‌నలో యంగ్ హీరో....

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ సినిమాల్లో న‌టించిన త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు శ్రీవిష్ణు.