థియేటర్లు తెరిచాక రిలీజ్ కాబోయే తొలి సినిమా ఏదంటే...

  • IndiaGlitz, [Thursday,October 08 2020]

సినిమా షూటింగ్‌లు.. ప్రతి ఒక్క హీరోది ఏదో ఒక సినిమా.. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలు సైతం కవర్ చేస్తుంటారు. సినిమా ప్రారంభమైందంటే.. సినిమా పట్టాలెక్కిందని పిక్స్.. ఫస్ట్ లుక్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకూ ఏదో ఒక అప్‌డేట్.. ఇలా దాదాపు ప్రతిరోజూ సినిమాలకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సందడి చేస్తూనే ఉంటుంది. ఇవి కాక.. ఇక ఫేవరెట్ హీరోలకు సంబంధించిన మూవీ అప్‌డేట్స్ ఎప్పుడూ ఏదో ఒకటి అభిమానులను కనువిందు చేస్తూనే ఉంటుంది. ఇక శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు పండుగే పండుగ.. ఏదో ఒక సినిమా రిలీజ్ ఉంటుంది. ఇంత సందడి మొత్తం మార్చి మూడో వారం వచ్చేసరికి ఒక్కసారిగా మాయమైంది. సినిమాలు.. షూటింగ్‌లు.. ధూమ్ ధామ్.. అంతా తుస్ అయిపోయింది.

మళ్లీ ఆరు నెలల తర్వాత షూటింగ్‌లు స్టార్ట్.. రాజమౌళి దుమ్ము దులిపారు.. ‘రంగే దే’ సందడి.. మహేష్ యూస్ షెడ్యూల్.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో అప్‌డేట్స్.. మళ్లీ కొత్త కొత్త అంచనాలతో సినిమాల షూటింగ్‌లు ప్రారంభమై పోయాయి. మూతపడిన థియేటర్లు సైతం అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అంతా ఓకే కానీ రిలీజ్ అవబోయే తొలి సినిమా ఏంటి? అనేది నిన్న మొన్నటి వరకూ ఉత్పన్నమైన ప్రశ్న. దీనికి మన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి సమాధానం వచ్చింది. ఆగస్త్య మంజు దర్శకత్వంలో అన్నపురెడ్డి ఎల్లారెడ్డితో కలిసి తాను నిర్మించిన ‘కరోనా వైరస్‌’ విడుదలవుతుందని రామ్‌ గోపాల్‌ వర్మ వెల్లడించారు. ఇక తొలి సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక స్టార్ హీరోల మాటేంటి?

దయచేసి ఆ ఒక్కటే ఇప్పటికైతే అడగొద్దు. స్టార్ హీరోలు సినిమాలు ఈ ఏడాదికి దాదాపు లేనట్టే. స్టార్ హీరోలందరి సినిమాలు షూటింగ్‌ దశలోనే ఉన్నాయి. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ నటించిన ‘జాతి రత్నాలు’, యాంకర్‌ ప్రదీప్‌ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘మహానటి’ తర్వాత స్వప్న సినిమా సంస్థ ‘జాతి రత్నాలు’ నిర్మించింది. మెగా కుటుంబం నుంచి సాయి తేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, అతని తమ్ముడు పంజా వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రాలు సైతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో సినిమాలు ఉండవనే చెప్పాలి. ఈ సారి సంక్రాంతి మాత్రం స్టార్ హీరోలను వెంటబెట్టుకుని మరీ వస్తుందనడంలో సందేహం లేదు. అప్పటి నుంచి అసలైన సినీ సందడి ప్రారంభం కానుంది.

More News

అవినాష్ రాజేసిన నిప్పు బాగా మండింది..

ఇవాళ షో అంతా ఫన్నీ ఫన్నీగా సాగిపోయింది. అవినాష్ చాలా ఇంటెలిజెంట్‌గా తన సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేస్తుండటంతో ఆ కారణంగా..

విజయ్ సేతుపతి-జయరామ్ హీరోలుగా నటించిన 'రేడియో మాధవ్' ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా 'మార్కొని మతాయ్'. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు.

రామ్ చరణ్ హోస్ట్‌గా డ్యాన్స్ టాలెంట్ షో.. ప్రత్యేకత ఏంటంటే..

రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌, ‘బీ పాజిటివ్’ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌‌‌గా ఉపాసన ఒక సొంత ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.

40 ఏళ్ల క్రితం టైటిల్‌తో క‌మ‌ల్ హాస‌న్‌..!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా `ఖైదీ`తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన లొకేష్ క‌న‌రాజ్ ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బెయిల్‌..

ముంబై: డ్రగ్స్‌ కేసులో నటుడు సుశాంత్ చక్రవర్తి ప్రియురాలు రియా చక్రవర్తికి బెయిల్‌ లభించింది. గత నెల 9 నుంచి ముంబై బైకుల్లా జైలులో రియా ఉంది.