వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోష‌ల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం ఎంట‌ర్ టైన్మెంట్ మూవీస్ మాత్ర‌మే కాకుండా... అన్ని ర‌కాల జోన‌ర్స్ లో విభిన్న క‌థా చిత్రాల‌ను అందించాల‌నేదే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఉద్దేశ్యం. అందులో భాగంగానే 'ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢ‌చారి, ఓ..బేబి...ఇలా వైవిధ్య‌మైన, విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించి అన‌తి కాలంలోనే అటు ఆడియ‌న్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో అభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ‌గా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ 'వెంకీ మామ' చిత్రాన్ని, అలాగే అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో 'నిశ్శ‌బ్దం' అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీని కూడా నిర్మిస్తుంది.

అయితే... కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాల‌నే స‌దుద్దేశ్యంతో సోష‌ల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ నిర్మాణ సంస్థ‌తో ఎ.ఎన్.టి ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ క‌లిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సోష‌ల్ అవేర్న‌ష్ ఫిల్మ్ ను నిర్మిస్తోంది.

‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్ట్ ఇండీస్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీకి ఆర్తి శ్రీవాత్స‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ల్యాండ్ ఆఫ్ విడోస్ మరియు వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంట‌రీస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మ‌హిళల‌కు శుభ్ర‌త విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
డ్వేన్ బ్రావో తన అధికారిక సోషల్ మీడియా ఖాతా అయినా పేస్ బుక్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
 
ఈ చిత్ర విశేషాల‌ను ద‌ర్శ‌కురాలు ఆర్తి శ్రీవాత్స‌వ తెలియ‌చేస్తూ...డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గ‌ర్వంగాను ఉంది. జులైలో త‌మిళ‌నాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియ‌లో షూటింగ్ పూర్త‌య్యింది. ఆగ‌ష్టులో వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టోబాగో ల‌లో షూటింగ్ చేయ‌నున్నాం అని చెప్పారు.

ఈ మూవీకి నిర్మాత - టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, కో - ప్రొడ్యూస‌ర్ - వివేక్ కూచిభోట్ల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - శ్రీ న‌ట‌రాజ్, ప్రాజెక్ట్ డిజైన్ & ఎగ్జిక్యూష‌న్ - ఎ.ఎన్.టి ప్రొడక్ష‌న్స్.

More News

ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. 3జి నెట్‌వర్క్ ఔట్!

టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్ 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా తన మొత్తం 3 జి నెట్‌వర్క్‌ను మూసివేయాలని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కువ రియలైజేషన్ మరియు సగటు రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పై

‘బాహుబలి’ కంటే ముందే ‘సాహో’ ప్లాన్ చేశా కానీ...!!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్ చేసేంతలా రోజురోజుకు అంచనాలు...

‘యాత్ర’ డైరెక్టర్ కొత్త సినిమా.. నిర్మాతగా పీవీపీ

‘ఆనందో బ్రహ్మ’ సినిమా కామెడీ పండించి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ ఎమోషనల్‌గా టచ్ చేసిన మహి వి. రాఘవ్.. ఈ సారి ఏకంగా ‘సిండికేట్’ సినిమాతో వచ్చేస్తున్నారు.

'మిస్టర్‌ కిల్లర్‌' టీజర్‌ను విడుదల చేసిన అల్లరి నరేష్‌

రమేష్‌ స్టూడియోస్‌, శ్రీనిక్షిత ప్రొడక్షన్స్‌ పతాకాలపై చార్లెస్‌ దర్శకత్వంలో రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్‌ తుమ్మలపల్లి నిర్మిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మిస్టర్‌ కిల్లర్‌'. విశ్వ

ఉగ్రవాదంపై ఉక్కుపాదమే.. కీలక బిల్లుకు పెద్దలు ఆమోదం

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో భాగంగా దాయాదీ దేశాలను గజగజ వణికిస్తున్నప్పటికీ ఉగ్రమూకలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.