షారూక్ సినిమా ఆగిందా... క్లారిటీ ఇచ్చిన యూనిట్‌

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రెండేళ్ల త‌ర్వాత సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జీరో సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌కుండా సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన షారూక్ ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ఠాన్ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఇందులో దీపికా ప‌దుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్‌లో డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ దెబ్బ‌లాడుకున్నారంటూ వార్త‌లు వినిపించాయి.

దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ.. ‘‘లొకేషన్‌లో లైట్‌మెన్ స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డాడు. దాన్ని ఓ జూనియ‌ర్ ఆర్టిస్ట్ త‌న మొబైల్‌లో చిత్రీక‌రిస్తున్నాడు. గ‌మ‌నించిన సిద్ధార్థ్ స‌ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్ట్ చర్య‌ను త‌ప్పు ప‌ట్టారు. కానీ జూనియ‌ర్ ఆర్టిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ మాట వినకుండా మొబైల్‌లో ర‌హ‌స్యంగా చిత్రీక‌రించ‌డ‌మే కాకుండా, ఎదురు తిరిగి మాట్లాడాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ జూనియ‌ర్ ఆర్టిస్ట్‌ను సెట్స్ నుండి బ‌య‌ట‌కు పంపేశారు. అంతే త‌ప్ప దెబ్బ‌లాడుకునేంత ఏమీ జ‌రగ‌లేదు’’ తెలియజేసింది.

డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ త‌న టీమ్‌తో ఎంతో స్నేహంగా ఉంటార‌ని, అంద‌రినీ త‌న సోద‌రులుగా భావిస్తార‌ని, కాబట్టి ప‌ఠాన్ సినిమా గురించి సోష‌ల్ మీడియాలో వినిపిస్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

More News

‘ఆర్ఆర్ఆర్‌’... ప్లాన్ మార్చేసిన జ‌క్క‌న్న‌

ద‌ర్శ‌కధీరుడు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న పిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’.

మ‌రో కొరియ‌న్ రీమేక్‌కి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ రంగం సిద్ధం

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ‌సంస్థ‌లో ఒక‌టైన సురేష్ ప్రొడక్ష‌న్స్ బ్యానర్‌పై డి.సురేష్ బాబు మ‌రో కొరియ‌న్ రీమేక్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో

‘కేరింత’ హీరోపై చీటింగ్ కేసు

యువ హీరో విశ్వంత్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో చీటింగ్‌ కేసు న‌మోదైంది.

విజ‌య్ దేర‌వ‌కొండ ఎమోష‌న‌ల్ ట్వీట్‌

క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ లేటెస్ట్ మూవీ ‘లైగ‌ర్‌’. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.