చెన్నైప్రజలకు తారల చేయూత

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

చెన్నైలో కురుస్తున్న వ‌ర్షాల‌కు జ‌నం నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. గ‌త వందేళ్ల‌లో ఎన్న‌డు లేని విధంగా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో ప్ర‌భుత్వం యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. సినీ తారలు కూడా త‌మ అభిమానుల‌ను సేవా కార్య‌క్ర‌మాలు చేయాల‌ని పిలుపు నిస్తున్నారు. కొంత మంది సినీ తార‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు.

ఆక‌లితో అల‌మ‌టిస్తున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం కోసం హీరో సిద్ధార్థ్ ముందుకు వ‌చ్చాడు. ఆహార పొట్లాలు స‌రఫ‌రా చేయాల‌నుకునే వాళ్లు త‌న‌కు ఫోన్ చేయాల‌ని ట్విట్ట‌ర్ లో త‌న ఫోన్ నెంబ‌ర్ పోస్ట్ చేసాడు. అలాగే సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం ఇష్టం లేని వాళ్లు ఇంట్లోనే ఉండండి. బ‌య‌ట‌కు వ‌స్తే సేవా కార్య‌క్ర‌మాల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌న్నాడు. డాన్స్ మాస్ట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ రాఘ‌వేంద్ర ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా 10 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయం అంద‌చేసారు. వీరితో పాటు సూర్య, కుష్బూ, ఐశ్వర్య ధనుష్, అనిరుధ్, సౌందర్య రజనీకాంత్, విశాల్ త‌దిత‌రులు చెన్నై వ‌ర్షాల పై స్పందించి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.