నాన్నగారు ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య విషయమై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ గుడ్ న్యూస్ చెప్పీరు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షలో బాలుకి కరోనా నెగిటివ్ వచ్చిందని చరణ్ వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ చరణ్ ఓ వీడియోను విడుదల చేశారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో ఎస్పీ బాలుకి నెగిటివ్ అని నిర్ధారణ అయిందని కానీ.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఇంకా వెంటిలేటర్ తొలగించలేదని వెల్లడించారు.

‘‘కరోనా పరీక్షల్లో నాన్నగారికి నెగిటివ్ అని వచ్చింది. అయితే నాన్నగారు పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉండడంతో ఇంకా వెంటిలేటర్‌ తొలగించలేదు. నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా మెరుగవడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నాన్నగారు ఐపాడ్‌లో క్రికెట్‌, టెన్నిస్‌ మ్యాచ్‌లు చూస్తున్నారు. ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. రాసుకోవడం, మాట్లాడడం చేస్తున్నారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ కొనసాగుతోంది. అమ్మానాన్నల పెళ్లి రోజు సందర్భంగా వారాంతంలో చిన్న సెలబ్రేషన్‌ చేశాం. ఇన్ని రోజులూ నాన్నగారి క్షేమం కోసం ప్రార్థనలు చేసిన మీ అందరికీ ధన్యావాదాలు’’ అని చరణ్‌ పేర్కొన్నారు.

కాగా.. ఆగస్ట్ 5న కరోనా కారణంగా చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఆసుపత్రిలో జాయిన్ ఆయనట్టు ఆయన ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. అయితే ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే ఎస్పీబీ పరిస్థితి విషమించింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. తాజాగా బాలుకి నెగిటివ్ రావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More News

రచ్చ చేసిన కరాటే కల్యాణి.. నామినేషన్స్ లో గంగవ్వ..

తొలిరోజు బిగ్‌బాస్ షో ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైంది. కానీ ప్రేక్షకుల అంచనాలన్నీ మొదటి రోజే పటాపంచలయ్యాయి.

ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి ఇక లేరు..

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు.

ప్రియమణి ప్రధాన పాత్రలో బహుభాష చిత్రం 'కొటేషన్ గ్యాంగ్'

హీరోయిన్ ప్రియమణి నటిస్తున్న కొత్త సినిమా ‘‘కొటేషన్ గ్యాంగ్’’.

చంద్రబాబు, లోకేష్‌లపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అటు ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు.. ఇటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు ఏకకాలంలో గుప్పించారు.

ఎస్పీబీకి క‌రోనా నెగ‌టివ్‌

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా వైర‌స్ కార‌ణంగా కొన్నిరోజులుగా హాస్పిట‌ల్‌ల‌కే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే.