close
Choose your channels

"ఆదిత్యా థాక్రే.. సిగ్గుగా అనిపించట్లేదా..!?"

Tuesday, April 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆదిత్యా థాక్రే.. సిగ్గుగా అనిపించట్లేదా..!?

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటున్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ప్రధాని మోదీ లాక్‌డౌన్ కీలక ప్రకటన చేస్తారని.. ఇంటికెళ్లిపోవచ్చని వేయి కళ్లతో వేచి చూసిన వారు చివరికి వారి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. దీంతో మే-03వరకు ఇక్కడే ఉండలేమని తమ స్వస్థలాలకు వెళ్లిపోతామని వలస కార్మికులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నగరంలోని బాంద్రా రైల్వే స్టేషన్‌ ముందు ఆందోళన నిర్వహించారు. సుమారు 1500 మందికిపైగా కార్మికులు రోడ్లపైకి వచ్చి గుమిగూడారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వలస కూలీలపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.

ఆదిత్య థాక్రే ట్వీట్ ఇదీ..

అసలు కరోనా కేసులు అత్యధికంగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం కఠిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైమ్‌లో కేంద్రం ‘మహా సర్కార్’ దుమ్మెత్తి పోస్తోంది. ఈ క్రమంలో యువనేత, సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే చేసిన ట్వీట్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ‘ 24 గంటలు రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇది వరకే పలుమార్లు వేడుకున్నాం. వలస కూలీలు వాళ్ల స్వస్థలాలకు వెళ్లడానికి మాత్రమే తాము ఈ వినతి కేంద్రానికి చెప్పాం. ఇటీవల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్నే తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే మా ప్రభుత్వం 70,399 వలస కూలీలకు వసతి కల్పించింది’ అని ఇలా ఇంకా చాలా చాలానే ట్విట్టర్‌లో ఆయన రాసుకొచ్చారు.

ఆదిత్యా థాక్రే.. సిగ్గుగా అనిపించట్లేదా..!?

సిగ్గుగా అనిపించట్లేదా..!?

ఇవాళ బాంద్రాలో జరిగిన ఘటన, ఆదిత్య థాక్రే ట్వీట్స్‌పై ప్రముఖ అనలిస్ట్, యాంకర్ షెహ్‌జాద్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఆదిత్య చేసిన రెండు ట్వీట్స్‌ తాలుకూ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని మీరు నిందిస్తున్నారా..? బాంద్రా ఘటనతో మీ సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. గత కొద్దిరోజులుగా వలస కార్మికుల కోసం ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసని ఒకింత వ్యగ్యంగా షెహ్‌జాద్ ట్వీట్స్ చేశారు. ఆదిత్యా.. ఇలాంటి సందర్భాల్లో మీరు చేస్తున్న పనులకు, విమర్శలకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా..? అని విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అనంతరం ఈ ట్వీట్‌ను మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు ఆయన ట్యాగ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment