ఎన్టీఆర్ సినిమాలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు

  • IndiaGlitz, [Saturday,May 05 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  క‌థానాయ‌కుడిగా తార‌క్‌కు ఇది 28వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.  రాయ‌ల‌సీయ బ్యాక్‌డ్రాప్ చుట్టూ సాగే పొలిటిక‌ల్ స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంద‌ని తెలిసింది.

ఫ్యాక్షన్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో సీనియ‌ర్‌ న‌టులు జగపతిబాబు, నాగ‌బాబు ఫ్యాక్షనిస్టులుగా క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. వీరిద్ద‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలే.. సినిమాలో కీల‌కంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కి ముస్తాబవుతోంది. హైదరాబాద్‌లో జ‌రుగ‌నున్న ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, పూజా హెగ్డేపై కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. కాగా.. అక్టోబ‌ర్ 12న విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా  ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

క‌బీర్ లాల్ సార‌థ్యంలో ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ అవుతున్న స్పానిష్ మూవీ 'జూలియాస్ ఐస్‌'

యు.ఎస్‌కు చెందిన యంగ్ అండ్ ఫ్రీ ఫిలింస్ ఎల్ఎల్‌సి, ఇండియాకు చెందిన మూవీ మేజిక్‌, ప్ల‌స్ ఎక్యుప్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ... స్పానిష్‌లో సూప‌ర్ హిట్ థ్రిల్ల‌ర్ జూలియాస్ ఐస్‌

సెన్సార్ వారి మెప్పు పొందిన 'మహానటి' 

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ప్రపంచ వ్యాప్తంగా మే 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది 'మహానటి'. సెన్సార్ వారు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు.

'మెహబూబా' సెన్సార్‌ పూర్తి - మే 11 విడుదల

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో

పాట చిత్రీక‌ర‌ణ‌లో..'తేజ్ ఐ లవ్ యు'

ప్రేమ‌క‌థా చిత్రాల‌ స్పెషలిస్ట్ ద‌ర్శ‌కుడు ఎ.కరుణాకరన్.. ప్రేమకథలను తనదైన శైలిలో వెండి తెరపై చూపడంలో నేర్పరి.

శ‌ర్వా కోసం భారీ సెట్‌

శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది.