తెలంగాణలో 3 వేలు దాటిన కేసులు.. ఇవాళ ఎన్నంటే..

  • IndiaGlitz, [Wednesday,August 26 2020]

తెలంగాణలో తొలిసారిగా కరోనా కేసులు 3 వేల మార్కును దాటేశాయి. పరీక్షల సంఖ్యను కూడా పెంచడం దీనికి కారణం కావొచ్చు. నేడు తెలంగాణలో పెద్ద మొత్తంలో పరీక్షలు నిర్వహించారు. బుధవారానికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు 61,040 పరీక్షలను నిర్వహించగా.. 3018 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో 1,11,688కి కేసుల సంఖ్య చేరుకుంది.

కాగా నేడు ఒక్కరోజే 1060 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా 85,223 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,685 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 10 మంది మృతి చెందగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 780 మంది మృతి చెందారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 19,113 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతి 10 లక్షల జనాభాకు 29,146 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా.. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.69 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 76.30కు చేరుకుంది. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తంగా 10,82,094 టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 1176 టెస్టుల రిపోర్టులు రావల్సి ఉంది. తెలంగాణలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 475 కేసులు నమోదవగా.. రంగారెడ్డి 247, నల్గొండ 190, ఖమ్మం 161, వరంగల్ అర్బన్ 139, నిజామాబాద్ 136, కరీంనగర్ 127, జగిత్యాల 100 కేసుల చొప్పున నమోదయ్యాయి.

More News

‘బిగ్‌బాస్-4’కి షాక్.. కంటెస్టెంట్‌కి కరోనా!

బిగ్‌బాస్ షో ప్రారంభం అవుతుందంటేనే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు..

'క‌‌ల‌ర్ ఫొటో' నుంచి ఆగ‌స్ట్ 27న రానున్న మొద‌టి పాట

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా

ప‌వ‌న్ స‌ర‌స‌న బ‌న్నీ హీరోయిన్‌...?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకొచ్చే సినిమా ‘గ‌బ్బ‌ర్ సింగ్‌’.

మ‌ళ్లీ క్రేజీ కాంబో !!

కొన్ని కాంబినేష‌న్స్ పై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి బాగా ఉంటుంది. అలా ఆస‌క్తి రేపిన కాంబినేష‌న్స్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ ఒక‌టి.

మళ్లీ టాక్స్‌లో వ‌రుణ్ తేజ్ మూవీ!!

యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్‌,  'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలోనూ