హోం ఐసోలేషన్‌లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

తెలంగాణలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ నేతలు.. వారికి సంబంధించిన కారు డ్రైవర్లు, వ్యక్తిగత సహాయ సిబ్బంది అంతా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కవిత హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం హోం క్వారంటైన్లో గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని తమ నివాసంలో ఉన్నారు.