అంతా రివర్సే...

  • IndiaGlitz, [Friday,June 30 2017]

తెలుగులో 'నేను శైలజ' సినిమాతో హిట్‌ కొట్టిన చెన్నై సొగసరి కీర్తి సురేష్‌. ఇప్పుడు ఈ అమ్మడు అలనాటి మహానటి సావిత్రిపై రూపొందుతున్న బయోపిక్‌ 'మహానటి'లో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. 'ఎవడే సుబ్రమణ్యం' ఫేమ్‌ నాగ అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం కీర్తి సురేష్‌ బరువు పెరుగుతుందని, దీని కారణంగా తెలుగులో కీర్తి చేయబోయే మిగతా సినిమాల్లో ఆమె లావుగా కనపడుతుందని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కీర్తి సురేష్‌ మాత్రం ఇప్పుడు వినపడుతున్న వార్తలన్నీ పూర్తి రివర్స్‌గా ఉన్నాయని చెప్పుకొచ్చింది.
కీర్తి సురేష్‌ తెలుగులో చేస్తున్న పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమాతో పాటు సూర్య, విక్రమ్‌, విశాల్‌ సినిమాల్లో నటిస్తుందట. ఆ కారణంగా బరువు తగ్గానే కానీ పెరగలేదు. ఇక సావిత్రి బయోపిక్‌లో సావిత్రి పాత్ర కోసం ప్రాస్తటిక్‌ మేకప్‌ను ఉపయోగిస్తారని తెలిపింది. దీంతో కీర్తి సురేష్‌ బరువు పెరుగుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని తెలియడమే కాక, అసలు విషయమేంటనేది క్లారిటీ ఇచ్చినట్టయ్యింది. తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్‌గా మారిన కీర్తి సురేష్‌ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా మారింది.

More News

విలన్ గా ఫ్యామిలీ హీరో...

ఇప్పుడు సీనియర్ హీరోస్ అందరూ విలన్స్ గా మారుతున్నారు.

ప్రభుదేవాతో మరోసారి...

కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారిన ప్రభుదేవా దర్శకత్వంలో మంచి విజయాలను అందుకున్నాడు.

ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది..డెఫనెట్ గా సినిమా హిట్ అవుతుంది - ఎస్.ఎస్.రాజమౌళి

వరుస సక్సెస్ లతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన నేచురల్ స్టార్ నాని తాజాగా 'నిన్ను కోరి'

'పైసా వసూల్ ' తర్వాత పూరి సినిమా అదే!

విభిన్న కథలకు,విభిన్న చిత్రాలకు పూరి జగన్నాథ్ పెట్టింది పేరు.

రాందేవ్ బాబాగా అజయ్ దేవ్ గన్

భారతీయ సినిమాల్లో బయోపిక్ లకు ప్రాధాన్యత ఈమధ్యకాలంలో బాగా పెరిగింది.