'భ‌ర‌త్ అను నేను' లోనూ అలాగే..

  • IndiaGlitz, [Sunday,November 12 2017]

ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన కొరటాల శివ.. వ‌రుస విజ‌యాల‌తో అన‌తి కాలంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తోనే త‌న సినిమాల‌ను చేసిన శివ‌.. త‌న నాలుగో చిత్రాన్ని కూడా మ‌రో స్టార్ హీరోతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

శ్రీ‌మంతుడు త‌రువాత మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ రూపొందిస్తున్న ఆ చిత్రమే భ‌ర‌త్ అనే నేను. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. శివ గ‌త చిత్రాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌తి సినిమాలోనూ ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ హైలైట్ అవుతూనే ఉంది. మిర్చిలో వాన ఫైట్ ఎస్సెట్‌గా నిలిస్తే.. శ్రీ‌మంతుడు లో మామిడి తోపు ఫైట్‌.. జ‌న‌తా గ్యారేజ్‌లో గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్ ఫైట్ హైలైట్ అయ్యాయి.

ఇప్పుడు ఇదే వ‌రుస‌లో.. భ‌ర‌త్ అనే నేను లో కూడా ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంటుంద‌ట‌. ఈ సారి హోలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ పోరాట ఘ‌ట్టాన్ని శివ తీసార‌ని స‌మాచార‌మ్‌. మ‌రి.. రేపు స్క్రీన్‌పై ఈ సీన్‌కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి. కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న భ‌ర‌త్ అనే నేను ఏప్రిల్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

మ‌హేష్ కోసం హీరోయిన్ పాట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను. హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

'దేవిశ్రీ ప్ర‌సాద్' ప్రీమియ‌ర్ షో

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

'జంధ్యాల రాసిన ప్రేమకథ' సెన్సార్ పూర్తి, 24న విడుదల

కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జంధ్యాల రాసిన ప్రేమకథ'. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త మొదలగు వారు తారాగణం.

న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానున్న ప్రేమ‌తో మీ కార్తిక్

మూడు జెన‌రేష‌న్స్ మద్య ప్రేమ ఆప్యాయ‌త‌ల్ని చ‌క్క‌గా తెర‌కెక్కించిన‌ చిత్రం 'ప్రేమ‌తో మీ కార్తీక్'. రిషి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ‌, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతున్నారు.

ప్రాఫిట్ లో నాగ అన్వేష్ ఏంజిల్ చిత్రం

నాగ అన్వేష్,  హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన  'ఏంజెల్'.  ఈ చిత్రం నవంబర 3న  విడుదలై ఏంజెల్ చిత్రం ఆంధ్రా తెలంగాణ మొత్తం థియేటర్స్ కలిపి1st weak 80lacs షేర్ వచ్చింది.