'శ్రీమంతుడు' మళ్లీ వారి చేతికే చిక్కాడు

  • IndiaGlitz, [Wednesday,August 05 2015]

సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్, ఎం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం శ్రీమంతుడు'. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మాతలు. శృతిహాసన్ హీరోయిన్. ఈ సినిమా ఆగస్ట్ 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది.

తాజా సమాచారం ప్రకారం మహేష్ నటించిన నేనొక్కడినే', ఆగడు' చిత్రాలను విడుదల చేసిన ఈరోస్ సంస్థ ఈ శ్రీమంతుడు' సినిమా వరల్డ్ వైడ్ విడుదల హక్కులను సొంతం చేసుకున్నారని టాక్. దీంతో చిత్రి నిర్మాతలు పూర్తిగా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారట. గతంలో ఈరోస్ సంస్థ విడుదల చేసిన నేనొక్కడినే', ఆగడు' వారికి ఆశించిన స్థాయిలో లాభాలను తీసుకురాలేక పోయిన మాట వాస్తవమే. మరి పాజిటివ్ వైబ్స్ తో విడుదలవుతున్న శ్రీమంతుడు ఏ రేంజ్ లాభాలను తీసుకొస్తుందో చూడాల్సిందే.