‘ఎనిమి’ ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Saturday,October 23 2021]

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి ఎనిమీ అంటూ ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎనిమి సినిమా విశాల్‌కు 30, ఆర్యకు 32వ సినిమా కావడం విశేషం.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండోబోతోందో చూపించారు. బరిలోకి దిగితే మీ ఇద్దరు శత్రువులు.. ఆ తరువాత మిత్రులు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది. అయితే ఆర్య విశాల్‌కు ఎందుకు శత్రువుగా మారాల్సి వచ్చింది? అనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ అద్భుతంగా ఉన్నాయి.

ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ ఫేమ్ మిర్నాలిని రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆర్‌డీ రాజశేఖర్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

More News

సూపర్ స్టార్ రజినీకాంత్ `పెద్దన్న` టీజర్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అన్నాత్తె  తెలుగులో పెద్ద‌న్న పేరుతో రాబోతుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కు సన్నీ ఘాటు ముద్దు... రవి ఆశలు గల్లంతు, ప్రియాంకకు విశ్వ వార్నింగ్

కెప్టెన్సీ టాస్క్ వల్ల గత కొన్ని రోజులుగా ఇంటి సభ్యుల మధ్య ఏర్పడిన గ్యాప్‌ని తొలగించేందుకు బిగ్‌బాస్ యత్నించారు.

వ్యాక్సినేషన్‌ సెంచరీ: మీ శ్రమ వల్లే ఇదంతా... ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి రామ్‌‌చరణ్‌ కృతజ్ఞతలు

అగ్రరాజ్యాలకే సాధ్యం కానీ అసాధ్యాన్ని భారతదేశం ఇటీవల 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

దీపావళికి కానుకగా 'జీ 5' ఓటీటీలో సూపర్ హిట్ 'శ్రీదేవి సోడా సెంటర్' విడుదల

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక 'జీ 5'.

రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ దర్శకత్వంలో వివాదాస్పద సినిమా 'దహిణి'

తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన సినిమా 'దహిణి'.