ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా..'ఈ నగరానికి ఏమైంది'

  • IndiaGlitz, [Saturday,April 28 2018]

'పెళ్ళి చూపులు'తో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

తాజాగా ఈ యువ ద‌ర్శ‌కుడు.. అంతా కొత్త నటీనటులతో 'ఈ నగరానికి ఏమైంది' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విశ్వక్, అనీషా ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ సినిమా స్పెషల్ షోను పరిశ్రమలోని కొంతమంది ప్రముఖుల కోసం ప్రదర్శించారట.

వారు ఈ చిత్రాన్ని చూసి కథ, కథనం అద్భుతంగా ఉందనీ.. ఇంటర్వెల్ బాంగ్ కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఉందనీ.. తొలిసారిగా ఇటువంటి ఇంటర్వెల్ బాంగ్‌ను చూసామని అంటూనే.. సినిమాని బాగా తీశావని అభినందించారట. ప్రముఖులకు ఈ సినిమా నచ్చడంతో.. ఈ సినిమా విజయంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ చాలా ధీమాగా ఉన్నారని సమాచారం. మ‌రి.. ద‌ర్శ‌కుడిగా త‌రుణ్ ద్వితీయ విఘ్నాన్ని అధిగ‌మిస్తారో లేదో చూడాలి.

More News

మేడే సందర్భంగా వి. వి. వినాయ‌క్ చేతుల మీదుగా 'శంభో శంక‌ర‌' తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్

శంక‌ర్ హీరోగా శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌క‌త్వంలో  ఆర్.ఆర్ . పిక్చ‌ర్స్ సంస్థ   ఎస్. కె. పిక్చ‌ర్స్ సమ‌ర్ప‌ణ‌లో నిర్మిస్తోన్న చిత్రం  'శంభో శంక‌ర‌'.

చ‌ర‌ణ్ మూడోసారీ హిట్ కొడ‌తాడా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇప్ప‌టివ‌ర‌కు సంక్రాంతి సీజ‌న్ బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.  ఇప్ప‌టికే ఈ పండ‌గ సంద‌ర్భంలో వ‌చ్చిన‌ రెండు సినిమాల‌తోనూ విజ‌యం సాధించారు ఈ యంగ్ హీరో.

నివేదా హీరోయిన్ కాద‌ట‌

'జెంటిల్‌మన్', 'నిన్నుకోరి', 'జై లవకుశ' చిత్రాల‌తో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది కేర‌ళ‌ కుట్టి నివేదా థామస్.

మ‌హేష్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్‌

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'  బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజయం వైపు పరుగులు తీస్తోంది.

గ్రామీణ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.