Telangana DGP:తెలంగాణ డీజీపీపై వేటు.. ఈసీ సంచలన నిర్ణయం..

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

తెలంగాణ ఫలితాల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ హోదాలో కలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ పూర్తి కాకుండానే రాజకీయ నేతలను కలవడం నిషేధమని తెలిపింది. తక్షణమే దీనిపై తమకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు డీజీపీ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించింది. అలాగే ఐపీఎస్ అధికారులు సంజయ్ కుమార్, మహేష్ భగవ్‌తకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాగా ఇవాళ మధ్యాహ్నం రేవంత్ రెడ్డిని డీజీపీతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. రేవంత్ సీఎం అభ్యర్థి కావడంతో ఆయనకు కల్పించే భద్రతపై ఈ మేరకు చర్చించారు.

ఇదిలా ఉంటే కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. డిసెంబర్ 9వ తేదీ లోపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమిలో ముఖ్య నేతలు హాజరుకానున్నారు. దీంతో అక్కడ భద్రత ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో రేపటి లోపు సీనియారిటీ ఆధారంగా కొత్త డీజీపీని నియమించనున్నారు.

More News

KTR:ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. తమ గురి తప్పిందని ట్వీట్..

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాజా ఫలితాలు నిరాశ కలిగించాయని..

BJP Candidates:గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు వీరే..

గత ఎన్నికల్లో కంటే ఈసారి బీజేపీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు 5 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా..

Revanth Reddy, Komati Reddy:కొడంగల్‌లో రేవంత్ రెడ్డి.. నల్గొండలో కోమటిరెడ్డి ఘన విజయం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

Revanth Reddy:రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్.. శుభాకాంక్షలు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Congress, Brs:దక్షిణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్.. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ హవా..

దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ కనబరుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా కొనసాగుతోంది.