దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్ మళ్లీ 'జతగా..' వస్తున్నారు

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, పిజ్జా, రేణి గుంట, మహేష్, డా. సలీమ్... ఇలా ఇప్పటివరకూ సురేష్ కొండేటి దాదాపు పదకొండు చిత్రాలు విడుదల చేస్తే.. అవన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించే నిర్మాతగా సురేష్ కొండేటి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన 'ఉస్తాద్ హోటల్' అనే చిత్రాన్ని తెలుగులోకి విడుదల చేయబోతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

ఈ చిత్రవిశేషాలను సురేష్ కొండేటి తెలియజేస్తూ - " 'ఉస్తాద్ హోటల్' చిత్రంలో దుల్కర్, నిత్యా జోడీ బాగుందని ప్రేక్షకులు కితాబులిచ్చారు. ఇద్దరి మధ్య కెమిస్ర్టీ బాగా కుదిరింది. ఇటీవల విడుదలైన 'ఓకే బంగారం'లో ఈ జంట చేసిన మేజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు గెల్చుకుంది. 'బెస్ట్ పాపులర్ మూవీ', 'బెస్ట్ డైలాగ్స్', నటుడు తిలకన్ కి ప్రత్యేక అవార్డు లభించాయి. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న చిత్రం ఇది. భారీ వసూళ్లు సాధించి, మంచి కమర్షియల్ మూవీ అనిపించుకుంది. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ఇది.

సంభాషణలు ప్రత్యేక హైలైట్

ఇది చాలా అర్థవంతమైన చిత్రం. సాహితి రాసిన సంభాషణలు హైలైట్ గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన 'జర్నీ', 'పిజ్జా', 'డా. సలీమ్' చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు 'జతగా...'కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక, గోపీసుందర్ స్వరపరచిన పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇదొక మంచి మ్యూజికల్ మూవీ. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్, దర్శకత్వం: అన్వర్ రషీద్.

More News

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రారంభం నేడే

కింగ్ నాగార్జున... మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు తో స‌క్సెస్ సాధించి వెండితెర పైనే కాదు బుల్లితెర పై కూడా ఆక‌ట్టుకోగ‌ల‌ర‌ని నిరూపించి ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశారు.

స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్న‌సుబ్ర‌మ‌ణ్యం

సుప్రీమ్ హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

రోబో2కి ఫారిన్ నిర్మాత

శంకర్, రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన శివాజీ, రోబో రెండూ పెద్ద హిట్ కొట్టాయి. రోబో సినిమా అయితే ఆబాలగోపాలాన్ని ఆకర్షించింది.

బ్రూస్ లీ లో హీరోయిన్ గా క్రుతి క‌ర్భంథ‌

బ్రూస్ లీ చిత్రంలో హీరోయిన్ గా క్రుతి క‌ర్భంథ న‌టించ‌డం ఏమిటి..? క‌్రుతి క‌ర్భంథ రామ్ చ‌ర‌ణ్ సిస్ట‌ర్ గా న‌టిస్తుంది

వైజాగ్ లో రామ్

రామ్ నటించిన తాజా సినిమా శివమ్. అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్, రాశీఖన్నా జంటగా నటించారు.