బెల్ గ్రేడ్ లో 'డ్యూయెట్'....

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ, అదితిరావు హైద‌రీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'డ్యూయెట్‌'( త‌మిళంలో కాట్రు వెలియిడు). ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మార్చిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌ర‌గుతున్నాయి. ప్ర‌స్తుతం సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని సాంగ్స్ చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటుంది. సాంగ్స్ చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఇప్పుడు యూనిట్ బెల్‌గ్రేడ్‌లో ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ ఆర్మీ ఫైల‌ట్‌లా న‌టిస్తున్నాడు. ఓకే బంగారం వంటి స‌క్సెస్‌ త‌ర్వాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మ‌రో ల‌వ్ స్టోరి ఇది. సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగానే ఎదురుచూస్తున్నారు.

More News

కొత్త టెక్నాల‌జీతో అమ్మ‌డు సాంగ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ ఖైదీ నెం 150 చిత్రం భారీ స్ధాయిలో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. చిరు, కాజ‌ల్ పై చిత్రీక‌రించిన అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఆ ఇద్దరు హీరోలును చూసి జెలసీగా ఫీలవుతా - చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇండస్ట్రీలోని హీరోలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.వేరే హీరోల సినిమాలు సక్సెస్ సాధిస్తే ఫోన్ చేసి అభినందిస్తుంటాడు.

సైఫ్, కరీనాకు అబ్బాయి పుట్టాడు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ 2012లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే.

రాజశేఖర్ మరోసారి

పోలీస్, సి.బి.ఐ పాత్రలకు హీరో డా.రాజశేఖర్ పెట్టింది పేరు. అంకుశం, అగ్రహం, మగాడు సహా పలు పోలీసు క్యారెక్టర్స్లో రాజశేఖర్ మెప్పించారు.

మ‌న్మ‌ధుడుకు 14 ఏళ్లు..!

న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున హీరోగా విజ‌య్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం మ‌న్మ‌ధుడు. నాగార్జున‌, సోనాలి బింద్రే, అన్షు హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌థ - మాట‌లు అందించారు.