కొర‌టాల చిత్రంలో చిరు డ్యూయెల్ రోల్‌?

  • IndiaGlitz, [Tuesday,June 05 2018]

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చిరు మరో సినిమాను లైన్‌లో పెట్టినట్టు సమాచారం.

ఆ వివరాల్లోకి వెళితే..'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌ను తెరకెక్కించిన కొరటాల శివ డైరెక్షన్‌లో చిరు తన తదుపరి చిత్రం చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారనీ.. ఆ రెండు పాత్రలు కూడా ఎంతో వైవిధ్యమున్నవని చెబుతున్నారు. ఆ రెండు పాత్రల్లో ఒకటి చిన్న గ్రామంలో పొలం పనులు చూసుకునే పాత్ర కాగా.. మరొకటి ఎన్.ఆర్.ఐ. పాత్ర అనే కథనాలు వినిపిస్తున్నాయి.

చిరు కెరీర్‌లో డ్యూయల్ రోల్ పోషించిన సినిమాల్లో సింహభాగం సూపర్ హిట్స్‌గా నిలిచినవే. ఈ నేప‌థ్యంలో.. ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెరుగుతుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. అసలే.. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ఒక వైపు.. మాస్ హీరోల్లో నెంబర్ 1 అనిపించుకున్న హీరో మరో వైపు.. అలాంటి వీరి కలయికలో సినిమా అంటే అంచ‌నాల‌కు ఆకాశ‌మే హ‌ద్దు అని చెప్పాలి. 'సైరా' పూర్త‌య్యేలోపే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంది.

More News

సూర్య‌కి క‌లిసొచ్చిన‌ట్టే కార్తికి క‌లిసొస్తాడా?

ఒకప్పుడు ఎన్టీఆర్ - చక్రవర్తి, ఏఎన్నార్ – కె.వి.మహదేవన్.. కాంబినేష‌న్‌లో పాటలంటే అవి గ్యారంటీగా హిట్ అనే న‌మ్మ‌కం ఉండేది.

మరోసారి స్టూడెంట్‌గా మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

సైరా.. ఆ వ‌రుస‌లో చేరుతుందా?

మెగాస్టార్ చిరంజీవికి స‌మ్మ‌ర్ సీజ‌న్ బాగా క‌లిసొచ్చిన సీజ‌న్‌. ఈ సీజ‌న్‌లో ఆయ‌న న‌టించిన పలు చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి.

'రంగస్థలం' సింగర్ తో 'శంభో శంకర' పాట

నాన్ '"బాహుబలి-2'" రికార్డులు తిరగ రాసిన చిత్రం "రంగస్థలం"  ఈ సినిమా కి ప్రాణంగా  నిలిచిన " రంగా రంగస్థలనా"

అతిథి పాత్ర‌తో హ్యాట్రిక్ కొడుతుందా?

'మ‌హాన‌టి'తో కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సావిత్రి పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు.. ఆమెకు న‌టిగా మంచి గుర్తింపును తీసుకువ‌చ్చింది.