సరికొత్త దృశ్యకావ్యం18న విడుదల....

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

కార్తీక్ - కాశ్మీరా జంట‌గా పుష్య‌మి ఫిలింస్ బ్యాన‌ర్ పై బెల్లం రామ‌కృష్ణారెడ్డి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం దృశ్య‌కావ్యం. విభిన్న క‌థాంశంతో రూపొందిన దృశ్య‌కావ్యం చిత్రాన్ని ఈనెల 18న విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా ....
దృశ్య‌కావ్యం ద‌ర్శ‌క‌నిర్మాత బెల్లం రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ...చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే ఇష్టం. సినిమా రంగంలో ప్ర‌వేశించి ద‌ర్శ‌కుడు అవ్వాల‌నుకున్నాను. సినిమాల గురించి తెలుసుకోవాల‌నే ఉద్దేశ్యంతో శ్రీకాంత్ - కామ్నా జెఠ్మలానీ జంట‌గా వీడికి దూకుడెక్కువ సినిమాని నిర్మించాను. ఈ సినిమా నిర్మాణ స‌మ‌యంలో చాలా నేర్చుకున్నాను. అది దృశ్యకావ్యం సినిమా తెర‌కెక్కించ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఈ సినిమా క‌థ కోసం సంవ‌త్స‌రం పాటు స్ర్కిప్ట్ వ‌ర్క్ చేసాను. ఈ సినిమాకి కొత్త‌వాళ్లు అయితేనే క‌రెక్ట్ అనిపించి కొత్త వాళ్ల‌తో చేసాను. ఓ ప్రేక్ష‌కుడిగా నేను ఏం కోరుకుంటానో అది ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో 14 మంది క‌మెడియ‌న్స్ న‌టించారు. వీరు చేసే కామెడీ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. ఈ సినిమాకి క‌థ‌, ప్రాణం క‌మ‌లాక‌ర్ అందించిన సంగీతం ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలుస్తాయి.ప్ర‌తి ఒక్క‌రికి ఈ సినిమా క‌నెక్ట్ అవుతుంది అనేది నా న‌మ్మ‌కం అన్నారు.

More News

ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతున్న నారారోహిత్ 'సావిత్రి'

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు.

ఖుషీ సీక్వెల్ గురించి రేణు రియాక్షన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఎస్.జె.సూర్య కాంబినేషన్లో తాజాగా ఖుషీ సీక్వెల్ రూపొందించనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యిందా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం ప్ర‌స్తుతం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యింది అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

యార్ల‌గ‌డ్డ సుమంత్ సినిమా పూర్త‌య్యింది..

ప్రేమ‌క‌థ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే మంచి న‌టుడు అనిపించుకున్నాడు  అక్కినేని మ‌న‌వ‌డు..నాగార్జున మేన‌ల్లుడు యార్ల‌గ‌డ్డ సుమంత్. ఆత‌ర్వాత స‌త్యం, గౌరి, మ‌ధుమాసం, పౌరుడు, గోల్కండ హైస్కూల్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి స‌క్సెస్ సాధించాడు.

క్ష‌ణం బాలీవుడ్ రీమేక్ లో స‌ల్మాన్..

అడ‌వి శేషు హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన చిత్రం క్ష‌ణం. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి నిర్మించిన క్ష‌ణం సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.