నితిన్ సినిమా నుండి అతను వెళ్ళిపోయాడు...

  • IndiaGlitz, [Sunday,March 20 2016]

సెలక్టివ్ సినిమాలను చేస్తూ వెళుతున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంతతో కలిసి అ..ఆ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికి సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత యూనిట్ నుండి ముగ్గరు అవుటయ్యారు. ముందు ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించాల్సింది.

మధ్యలో అనిరుధ్ జంప్ అయ్యాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ కూడా మధ్యలోనే వెళ్ళిపోయాడు. రీసెంట్ గా సినిమాటోగ్రాఫర్ నటరాజన్ కూడా సినిమా నుండి బయటకు వెళ్ళిపోయాడు. మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆఫర్ రావడంతో సినిమా నుండి తప్పుకోవాలనుకుంటున్నట్టు త్రివిక్రమ్ కు చెప్పేశాడట. ఇప్పుడు యూనిట్ షారూక్ ఖాన్ మూవీ దిల్ వాలే మూవీ సినిమాటోగ్రాఫర్ డూడ్ లే ను తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.

More News

రాజ్ తరుణ్ తో చైతు హీరోయిన్....

వరుస విజయాలు అందుకుంటున్న హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు ఆడో రకం-ఈడోరకం సినిమా చేస్తున్నాడు.

ఎన్టీఆర్ తో నాని డైరెక్టర్....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాబాయ్ నాకెరీర్ కు ఇన్ స్పిరేషన్ - రాంచరణ్

'ఇరవై సంవత్సరాల వయసులో నేను కూడా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే...మా అమ్మ నన్ను ఒకరి దగ్గరికి పంపించి తలుపు వేసింది.

'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకలో 'బంతిపూల జానకి' మోషన్ పోస్టర్ లాంచ్!!

ధన్ రాజ్,దీక్షాపంత్,షకలక శంకర్,అదుర్స్ రఘు,వేణు,చమ్మక్ చంద్ర,రాకెట్ రాఘవ,సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ""బంతిపూల జానకి".

వ‌ర్మ ట్వీట్స్ పై ప‌వ‌న్ రిప్లై..

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మెగాస్టార చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌పై వార్త‌ల్లో ఉండేలా ఏదో ఒక ట్వీట్ చేస్తునే ఉంటార‌న్న విష‌యం తెలిసిందే.