అయోధ్య రామమందిరానికి వెండి ఇటుకలు పంపొద్దు: తీర్థక్షేత్ర ట్రస్ట్

  • IndiaGlitz, [Thursday,February 18 2021]

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం నిర్మాణానికి తమ వంతు సాయం అందించాలని భావిస్తున్న భక్తులు ధనం లేదంటే వెండి ఇటుకలనో ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వెండి ఇటుకలను భక్తులు పంపించారు. అయితే ఇక మీదట మాత్రం ఎవరకూ వెండి ఇటుకలను పంపించవద్దని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. భక్తులు బహూకరించిన వెండి ఇటుకలను భద్రపరచడానికి బ్యాంకు లాకర్లలో స్థలం లేదని, అందుకే ఎవరూ వెండి ఇటుకలను సమర్పించవద్దని కోరింది.

ఇప్పటి వరకూ భక్తులు 400 కిలోగ్రాముల వెండి ఇటుకలను సమర్పించారని ట్రస్ట్ వెల్లడించింది. ఇక అంతకు మించి భద్రపరచలేమని స్పష్టం చేసింది. రామ మందిర నిర్మాణానికి దేశంలో అనేక మంది భక్తులు వెండి ఇటుకలను బహూకరిస్తున్నారని ట్రస్ట్ తెలిపింది. ఇంకా వెండి ఇటుకలను పంపిస్తూనే ఉన్నారని వెల్లడించింది. అయితే వాటిని ఎలా భద్రపరచాలన్నదే సమస్యగా మారిందని ట్రస్ట్ తెలిపింది. ప్రస్తుతానికి ఎవరూ వెండి ఇటుకలను బహూకరించవద్దని కోరింది. ఇప్పటికే బ్యాంక్ లాకర్లన్నీ నిండిపోయాయని వెల్లడించింది. భక్తుల మనోభావాలను తాము గౌరవిస్తామని కానీ భద్రపరచడమనేది కష్టంగా మారిందని ట్రస్ట్ తెలిపింది.

More News

హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులను సుమారు వంద మంది చూస్తుండగానే విచక్షణారహితంగా నరికి చంపేశారు.

నిర్మాతగా రవితేజ.. నిజమెంతో..?

మాస్ మ‌హారాజ ర‌వితేజ‌. నేటిత‌రం యువ హీరోలు చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌. ఎలాంటి స‌పోర్ట్ లేకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌వితేజ త‌ర్వాత న‌టుడిగా మారడం,

తార‌క్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌.. జ‌నాలు మారుతారా?

మ‌నం చేసే నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఎదుటివారు ప్రాణాలు కోల్పోతారు. అండ కోల్పోతారు. కాబ‌ట్టి మ‌న‌ల్ని మ‌నం స‌రిద్దిద్దుకోవాలి అని అంటున్నారు స్టార్ హీరో ఎన్టీఆర్ ఈరోజు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక

‘రాధేశ్యామ్‌’లో ప్ర‌భాస్ కాస్ట్యూమ్స్ కోసం ఎంత ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

ప్యాన్ ఇండియాస్టార్ ప్ర‌భాస్ ఇమేజ్ బాహుబ‌లి త‌ర్వాత మారిపోయింది. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకుంటే మినిమం మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ పెట్టుకోవాల్సి వ‌స్తుంది మ‌రి.

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ నాగ్ అశ్విన్ ..కార‌ణ‌మేంటో తెలుసా?

బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ సాహో త‌ర్వాత వ‌రుసగా నాలుగు ప్యాన్ ఇండియా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇందులో ముందుగా