ర‌వితేజ రిస్క్ తీసుకుంటాడా?

  • IndiaGlitz, [Friday,June 26 2020]

మాస్ మహారాజా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రవితేజ ఒక పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్‌గా ర‌వితేజ గురించి ఓ ఆసక్తిక‌ర‌మైన వార్త సోష‌ల్ మీడియాలో షికార్లు చేస్తుంది. అదేంటంటే ర‌వితేజ త్వ‌ర‌లోనే నిర్మాత‌గా మార‌బోతున్నార‌ని. త్వ‌ర‌లోనే బ్యాన‌ర్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంద‌నే ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాడ‌ని మాస్‌రాజా. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమాను తీయ‌డం కంటే దాన్ని రిలీజ్ చేయ‌డం త‌ల‌నొప్పిగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో ర‌వితేజ రిస్క్ తీసుకోడ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం క్రాక్ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం ఎదురుచూస్తున్నాడు ర‌వితేజ‌. ఈ సినిమా త‌ర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ట్రాక్ ఎక్క‌క ముందే డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడు. వీటి మ‌ధ్య‌లో త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడు. అలాగే మ‌ల‌యాళ రీమేక్‌లో అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమాలోనూ ర‌వితేజ న‌టిస్తున్నాడ‌ని టాక్‌.

More News

బిగ్‌బాస్‌4 వ్యాఖ్యాత‌గా సమంత‌..?

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది.

డిజిట‌ల్ రంగంపై క‌న్నేసిన అగ్ర నిర్మాణ సంస్థ‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో యువీ క్రియేష‌న్స్ ఒక‌టి. వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌లు ఈ బ్యాన‌ర్‌పై సినిమాల‌ను రూపొందించే సంగ‌తి తెలిసిందే.

ఓ స్టార్ హీరోతో ‘షాడో’ను రూపొందించనున్నాం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

మధుబాబు రచించిన తెలుగు నవల ‘షాడో’ ఇప్పుడు దృశ్యరూపంగావించబడుతోంది. అతి పెద్ద నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్స్

రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకత్వంలో 'సైనైడ్‌'

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్‌ టచ్‌రివర్‌ ప్రకటించిన కొత్త సినిమా 'సైనైడ్'.

రచ్చకెక్కిన దాస‌రి త‌న‌యుల ఆస్థి గొడ‌వ‌

సీనియ‌ర్ దివంగ‌త ద‌ర్శ‌కుడు డా.దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న‌యుల మ‌ధ్య ఆస్థి గొడ‌వ‌లు రేగాయి. దాస‌రి పెద్ద కొడుకు ప్ర‌భు, చిన్న కొడుకు అరుణ్ కుమార్‌పై జూబ్లీహిల్స్‌