గురువు బాట‌లోనే శిష్యుడు

  • IndiaGlitz, [Wednesday,July 18 2018]

రామ్‌గోపాల్ వ‌ర్మ తొలి చిత్రం శివ‌తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్నాడు. ఇదే శివ సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టి పేన్ ఇండియా డైరెక్ట‌ర్ అయ్యాడు. ఇప్పుడు గురువు దారిలోనే ఆయన శిష్యుడు అజ‌య్ భూప‌తి వెళ్లే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేసిన 'ఆర్ ఎక్స్ 100' సూప‌ర్ హిట్ అయ్యింది.

తొలి నాలుగు రోజుల్లోనే ప‌ది కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. చాలా మంది నిర్మాత‌లు అజ‌య్ భూప‌తితో సినిమా చేయ‌డానికి ఆస‌క్తిగా ఉన్నారు. ఇదే త‌రుణంలో బాలీవుడ్ నిర్మాణ సంస్థ పాంట‌మ్ అజ‌య్ భూప‌తిని 'ఆర్ ఎక్స్ 100' హిందీలో రీమేక్ చేయ‌మ‌ని సంప్ర‌దించింద‌ట‌. అజ‌య్ ప్ర‌స్తుతం తెలుగులో వ‌స్తున్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలా? లేక హిందీలోకి అడుగుపెట్టాలా? అని ఆలోచిస్తున్నాడు.

More News

కార్తీ, సాయెషా సైగల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'చినబాబు'

పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య నిర్మించగా పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు..

ఆగస్ట్‌ 3న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'శివకాశీపురం'

ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్‌ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'శివకాశీపురం'.

200 మిలియ‌న్ వ్యూస్‌ తో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ స‌రైనోడు ఇండియా రికార్డ్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ , డైన‌మిక్‌ డైరక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఎస్ ప్రోడ్యూస‌ర్ అల్లు అరవింద్ నిర్మాత గా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సంచ‌ల‌నాలు

జులై 21న 'హ్యాపి వెడ్డింగ్' ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ ఈవెంట్

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌.

జులై 27న 'మెహిని' గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న త్రిష‌

తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన అందంతో అభినయంలో ద‌శాబ్ద‌కాలం గా టాప్ హీరోయిన్ గా ఆక‌ట్టుకున్న త్రిష తిరిగి మెహిని గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.