మరోసారీ రోజాకు నిరాశేనా?


Send us your feedback to audioarticles@vaarta.com


ఏపీలో మళ్లీ మంత్రి పదవుల కలకలం రేగింది. అయితే నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాకు మాత్రం ఈసారి కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఈ నేపథ్యంలో వారి స్థానంలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా మంత్రి పదవుల రేసులో అంబటి రాంబాబు, పిన్నెల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, పొన్నాడ సతీష్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కనీసం రోజా పేరును పరిశీలనకు కూడా తీసుకోలేదని.. ఈ నేపథ్యంలో ఆమెకు ఈసారి కూడా నిరాశేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments