ప‌వ‌న్ మేన‌రిజ‌మ్ ని హీరోయిన్ కి నేర్పుతున్న డైరెక్ట‌ర్..

  • IndiaGlitz, [Friday,July 08 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం బ‌ద్రి. ఈ చిత్రం ప‌వ‌న్ - పూరి కెరీర్ లో మ‌రిచిపోలేని చిత్రంగా నిలిచింది. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్ తో పూరి చేయించిన ఓ మేన‌రిజ‌మ్ ప‌వ‌న్ కి సింబ‌ల్ గా మారిపోయింది. ఆ మేన‌రిజ‌మ్ ఏమిటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నిర్మాత దిల్ రాజు సైతం ఓ ఆడియో ఫంక్ష‌న్ లో పూరి ఓ క్ష‌ణాన ప‌వ‌న్ తో ఆ మేన‌రిజ‌మ్ చేయించాడో కానీ...ప‌వ‌న్ కి ఒక సింబ‌ల్ గా మారిపోయింద‌ని కూడా చెప్పారు.

ఇదిలా ఉంటే...మెగా హీరో వ‌రుణ్ తేజ్ తో శేఖ‌ర్ క‌మ్ముల ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తుంది. వ‌రుణ్ తేజ్ - సాయిప‌ల్ల‌వికి శేఖ‌ర్ క‌మ్ముల ఏక్టింగ్ వ‌ర్క్ షాప్ నిర్వ‌హిస్తున్నారు. ఈరోజు ఈ వ‌ర్క్ షాప్ స్టిల్ ఒక‌టి రిలీజ్ చేసారు. ఈ స్టిల్ చూస్తుంటే... శేఖ‌ర్ క‌మ్ముల హీరోయిన్ సాయి ప‌ల్ల‌వికి ప‌వ‌న్ మేన‌రిజ‌మ్ నేర్పిస్తుంటే...త‌న బాబాయ్ మేన‌రిజ‌మ్ త‌లుచుకుంటూ...త‌న‌లోత‌ను న‌వ్వుకుంటూ వ‌రుణ్ తేజ్ అలా చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది. నిజంగా ఈ చిత్రంలో ప‌వ‌న్ మేన‌రిజ‌మ్ పెడుతున్నారో...లేక అనుకోకుండా అలా జ‌రిగిందో కానీ...స్టిల్ మాత్రం అదిరింది. మీరు ఓ లుక్కేయండి...మీకే తెలుస్తుంది.

More News

ఆ ద‌ర్శ‌కుడితో మూడోసారి

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతుంది.

జూలై 16న 'చుట్టాలబ్బాయి' ఆడియో

లవ్ లీ రాక్ స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్,ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో

నయనతార నిర్ణయంతో షాకైన బన్ని..

అందాల తార నయనతార శింబు,ప్రభుదేవా లతో లవ్ పడడం...ఆతర్వాత వాళ్లతో నయనతార లవ్ బ్రేక్ అప్ అవ్వడం తెలిసిందే.

మెగా హీరోకే ఏక్టింగ్ నేర్పుతున్న శేఖర్ కమ్ముల....

ఆనంద్,గోదావరి,హ్యాపీడేస్,లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్...ఇలా విభిన్న కథా చిత్రాలను అందించిన శేఖర్ కమ్ముల తాజాగా వరుణ్ తేజ్ తో

రామెజిఫిల్మ్ సిటి లో చివరి పాట చిత్రీకరణ జులై 22న సునీల్ 'జక్కన్న' విడుదల

సునీల్ హీరోగా,మన్నార్ చోప్రా హీరోయిన్ గా,ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న