టాలీవుడ్‌లో విషాదం .. క్యాన్సర్‌తో డైరెక్టర్ శరత్ కన్నుమూత

  • IndiaGlitz, [Friday,April 01 2022]

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో దర్శకుడు శంకర్ కన్నుమూశారు. గత కొంత‌ కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో మరణించినట్లు తెలుస్తోంది. ఇక శరత్ మృతి వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ద‌ర్శ‌కుడు శ‌ర‌త్‌ అవివాహితుడు. దాదాపు 20 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ‌ర‌త్.. 'డియ‌ర్' న‌వ‌ల ఆధారంగా 'చాద‌స్త‌పు మొగుడు'తో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. బాల‌కృష్ణ‌తో 'వంశానికొక్క‌డు, పెద్ద‌న్న‌య్య‌, సుల్తాన్, వంశోద్ధార‌కుడు' సినిమాలు తెరకెక్కించారు. ఇక సుమ‌న్ తో 'చాద‌స్త‌పు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ‌-బావ‌మ‌రిది, చిన్న‌ల్లుడు' సినిమాలు తెర‌కెక్కించాడు శ‌ర‌త్. కృష్ణ‌తో 'సూప‌ర్ మొగుడు' రూపొందించాడు.

More News

500 తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన సీఎం జగన్.. బెజవాడలో పరుగులు

విజయవాడలోని బెంజిస‌ర్కిల్ వ‌ద్ద శుక్రవారం త‌ల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్ వాహ‌నాల‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు.

ఆర్ఆర్ఆర్ యూనిట్‌పై ఆగ్రహం.. స్పందించిన అలియా, సింగిల్‌ పోస్ట్‌తో అందరికీ ఇచ్చిపడేసిందిగా

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’.

నాగార్జున చేతుల మీదుగా విడులైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘గాలివాన’ ట్రైలర్‌

పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నుండి కామెడీ డ్రామా ‘‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’’ మరియు అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి ‘‘లూజర్‌’’

హైదరాబాదీలకు బంపరాఫర్.. రూ.59తో మెట్రోలో రోజంతా ప్రయాణం, కానీ..?

ప్రజలను ట్రాఫిక్ కష్టాలకు దూరంగా, సుఖమయ, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోన్న హైదరాబాద్‌ మెట్రో ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటోంది.

వరంగల్ ఎంజీఎంలో దారుణం: ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి..  విచక్షణారహితంగా కొరికేసిన మూషికాలు

వేలు, లక్షలు పోసి కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు.