చీప్ స్టార్.. ‘‘మీకు అరటిపండ్లు తీయడం బాగా వచ్చట’’ : రవితేజపై డైరెక్టర్ రమేశ్ వర్మ భార్య కామెంట్స్

  • IndiaGlitz, [Friday,February 11 2022]

ఎప్పుడూ తన పనేదో తాను చూసుకుని.. వున్నంతసేపు తన ఎనర్జీ, పంచులతో అందరినీ నవ్వించే మాస్ మాహారాజా రవితేజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఆయన నటించిన తాజా చిత్రం ‘‘ఖిలాడీ’’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్ వర్మపై రవితేజ చేసిన వ్యాఖ్యలు.. ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్న సంకేతాలు అటు అభిమానులు, ఇటు పరిశ్రమకు వెళ్లాయి. ఆ స్టేజ్‌పై రమేశ్ వర్మను కాకుండా.. ఎంతసేపు నిర్మాత కోనేరు సత్యనారాయణనే ప్రస్తావించారు రవితేజ. రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే ‘‘ఖిలాడీ’’ చేయడానికి ఒప్పుకున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేనే సినిమాకు సంబంధించి మీరే అన్ని విషయాలు దగ్గరుండి చూసుకోవాల్సింది అంటూ కోనేరు సత్యనారాయణతో అనడం చూస్తుంటే.. రమేశ్‌తో బాగా ఫైట్ జరిగిందని అర్ధమవుతోంది.

ఇక ఈ గొడవ జరుగుతున్న తరుణంలోనే రమేష్ వర్మ భార్య రేఖా వర్మ సీన్‌లోకి ఎంటరయ్యారు. రవితేజను ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా ఆమె కామెంట్స్ చేయడంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో మరింత హాట్ టాపిగ్గా మారింది. శుక్రవారం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రవితేజను ఒక చీప్‌స్టార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ‘అరటిపండ్లు మీకు బాగా వచ్చు అనుకుంట తీయడం. డైరెక్టర్ గారు నెక్స్ట్ టైం క్లాసెస్ తీసుకోండి RT దగ్గర.. అరటిచెట్టు నరికి ఇచ్చినా సరిపోలేదు RTకి. డైరెక్టర్‌కి ఒక స్టైల్ ఉంటుంది అది మీకు చెప్పి చేయిస్తేనే కెమెరాలో యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తావ్...క్రెడిట్ గోస్ టు డైరెక్టర్’ అంటూ రేఖా వర్మ తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. కొసమెరుపుగా ‘మాస్ నే క్లాస్ చేసిన డైరెక్టర్, థియేటర్లో కనిపిస్తుంది రమేష్ గారు మీ వాల్యూస్ రేపు థియేటర్లో కలుద్దాం’ అంటూ చెప్పారు రేఖ.

గతంలో దర్శకుడు అజయ్ భూపతి కూడా ఇదే మాట రవితేజని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధమవుతుంది అని రేఖావర్మ అనడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలు రవితేజకు, రమేష్ వర్మకు మధ్య ఏం జరిగింది అన్నది తెలియకుండా వుంది. ఇదే సమయంలో రేఖా వర్మ సైతం ఈస్థాయిలో రియాక్ట్ అవ్వడం కూడా అనేక ప్రశ్నలకు తావిస్తోంది. రవితేజ.. రమేష్ వర్మ కాంబినేషన్లో 2011లో వీర అనే సినిమా వచ్చింది. కానీ అది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ వీరిద్దరి కాంబోలో ఖిలాడీ వచ్చింది. హ్యాపీగా వుండాల్సిన సమయంలో ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందా అని ప్రేక్షకులు భయపడుతున్నారు.

More News

మోహన్‌బాబు వద్దకు మంత్రి పేర్నినాని.. ఈ కొత్త ట్విస్ట్ ఏంటో, టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని శుక్రవారం భేటీ అయ్యారు.

గుజరాత్ తీరంలో 11 పాక్ పడవల కలకలం.. బీఎస్ఎఫ్, వాయుసేన సెర్చ్ ఆపరేషన్

గుజరాత్‌లోని అరేబియా తీరంలో పాకిస్తాన్‌కు చెందిన 11 పడవలు భారత జలాల్లోకి ప్రవేశించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఈడీ లేఖతో కలకలం... మళ్లీ తెరపైకి టాలీవుడ్‌కు డ్రగ్స్‌ కేసు, ఈసారి డొంక కదలేనా..?

కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

టాలీవుడ్‌కు శుభవార్త .. ఏపీలో అందుబాటులోకి కొత్త టికెట్ ధరలు, త్వరలోనే జీవో

గడిచిన కొన్ని నెలలుగా టాలీవుడ్‌కు - ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న టికెట్ ధరల పెంపు, థియేటర్‌ల సమస్యలకు చెక్ పెట్టేందుకు సినీ ప్రముఖులు కీలక ముందడుగు వేశారు.

మీ భరోసాతో ఉత్సాహంగా ముందుకెళ్తాం: జగన్‌కు థ్యాంక్స్ చెబుతూ చిరంజీవి ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.