సామాన్యుడిలా చార్మినార్ నైట్‌బజార్‌లో రాజమౌళి షికారు... గుర్తుపట్టని జనం, తీరా విషయం తెలిసి

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా దేశవ్యాప్తంగా దుమ్ములేపుతోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పారని క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ఆర్ఆర్ఆర్ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళితో సినిమా చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ క్యూకడుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న జక్కన్క వెకేషన్‌కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశం గర్వించదగ్గ గొప్ప డైరెక్టర్లలో ఒకరిగా వున్నప్పటికీ రాజమౌళి చాలా నిరాడంబరంగా వుంటారు. హంగులూ ఆర్భాటాలకూ దూరంగా వుంటారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని హిస్టారికల్ ప్లేస్ చార్మినార్ వద్ద సామాన్యుడిలా షికారుకు వచ్చారు.

వివరాల్లోకి వెళితే.. రంజాన్‌ మాసంలో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్‌ వద్ద షాపింగ్‌ హడావిడి కొనసాగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చార్మినార్ అందాలను, మార్కెట్‌లో సందడిని స్వయంగా వీక్షించారు రాజమౌళి. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు ఆయనను గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సామాన్యుడిలా నైట్ బజార్ మొత్తం తిరిగిన జక్కన్న‌ను తొలుత అక్కడి వారు గుర్తుపట్టలేకపోయారు. కానీ కొందరికీ డౌట్ రావడంతో వుండబట్టలేక ఆయన వద్దకు వెళ్లి .. సార్ మీరు రాజమౌళియే కదా అని అడిగేశారు. దీనికి ఆయన అవునని సమాధానం ఇవ్వడంతో వారు నమ్మలేకపోయారు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిసి మరింత మంది పోగయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి తన నెక్స్ట్ మూవీని సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు. ఇందుకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

More News

సినీరంగంలో ఆయనో మహారథి : నారాయణ్ దాస్ నారంగ్ మరణంపై చిరు, మహేశ్ సంతాపం

ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, థియేటర్స్‌ అధినేత నారాయణదాస్‌ నారంగ్‌ (78) కన్నుమూసిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌లో విషాదం: ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ దాస్ నారంగ్ కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు,

అంగరంగ వైభవంగా ప్రారంభమైన "ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు"

కుటుంబం అంతా కలిసి చూసేలా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వంటి సూపర్ డూపర్  హిట్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల్లో

కిషోర్‌కుమార్‌ ఏ పాత్రనైనా చేయగలడు అనిపించుకోవాలన్నదే నా కోరిక

‘పద్మశ్రీ’, ‘నేనే నక్షత్ర’ చిత్రాలలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన యువ నటుడు కిషోర్‌ కుమార్‌.

‘భలే భలే బంజారా’ సాంగ్ ప్రోమో: చరణ్‌కు ధీటుగా స్టెప్పులేసిన చిరు.. అభిమానులు పూనకాలే

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘‘ఆచార్య’’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.