దర్శకుడికి హీరోయిన్ నచ్చేలేదు...

  • IndiaGlitz, [Sunday,December 06 2015]

నాగచైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌ల‌యాళ చిత్రం ప్రేమ‌మ్' రీమేక్ మ‌జ్ను'. ఈ సినిమాలో శృతిహాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అయేషా శ‌ర్మ‌ను హీరోయిన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అయేషా శ‌ర్మ స్థానంలో రెజీనా వ‌చ్చి చేరింది. ద‌ర్శ‌కుడు చందు మొండేటికి చైతు స‌ర‌స‌న అయేషా స‌రిపోద‌నే భావ‌న రావ‌డంతో అయేషా స్థానంలో రెజీనాను తీసుకున్నారు. ఈ నెల చివ‌రి వారం లేదా వ‌చ్చే నెల మొద‌టి వారంలో రెజీనా యూనిట్‌తో జాయిన్ కానుంది. సినిమాను వ‌చ్చే వేస‌వి కానుక‌గా స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాతలు బావిస్తున్నారట‌. మ‌రి ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చైతుకి ఎలాంటి విజయాన్ని చేకూర్చుతుందో చూడాలి.