కె.వి.రెడ్డిగా క్రిష్ ?

  • IndiaGlitz, [Saturday,October 21 2017]

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా మ‌హాన‌టి సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ రోల్‌లో కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇటీవ‌లే ఆకాశ వీధిలో అందాల జాబిలి పేరుతో కీర్తి పుట్టిన‌రోజున ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. కేవ‌లం కీర్తి క‌ళ్లు మాత్ర‌మే క‌న‌బ‌డేలా విడుద‌ల చేసిన ఆ పోస్ట‌ర్ లో.. సావిత్రిని గుర్తుకు తెచ్చింది కీర్తి.

ఈ సినిమాలో ఎస్వీఆర్‌గా మోహ‌న్‌బాబు న‌టిస్తుండగా.. స‌మంత‌, షాలినీ పాండే, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్, ప్ర‌కాష్ రాజ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమాలో మాయాబ‌జార్ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాలు ఉంటాయ‌ట‌. ఆ చిత్రానికి ద‌ర్శ‌కుడు అయిన‌ కె.వి.రెడ్డి పాత్ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ న‌టిస్తుండ‌గా.. కె.వి.రెడ్డి అసిస్టెంట్ అయిన మ‌రో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు పాత్ర‌లో పెళ్లి చూపులుకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది.

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

More News

వెంకటేష్ తో యువ కథానాయకుడు..

ఈ ఏడాది ఆరంభంలో గురు చిత్రంతో సందడి చేశారు సీనియర్ కథానాయకుడు వెంకటేష్. తదుపరి చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకున్న ఆయన ఎట్టకేలకు ఓ మూవీకి ఓకే చెప్పారు.

వారం గ్యాప్ లో మహేష్, బన్నీ?

ఈ సంవత్సరం ఒకే ఒక సినిమాతో సందడి చేసారు సూపర్స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. స్పైడర్ చిత్రంతో సెప్టెంబర్లో మహేష్ అభిమానుల ముందుకొస్తే..

దలైలామా ను కలవొద్దు... చైనా ఘాటు హెచ్చరిక

గతం లో విదేశీ నాయకులు ఎవరైనా బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ను కలిస్తే చైనా నిరసన తెలుపుతూ వచ్చేది. కానీ ఇప్పుడు దలైలామాపై చైనా తన వైఖరిని కఠినతరం చేసినట్టు తెలుస్తోంది.

త్రివిక్ర‌మ్ డబుల్ ధ‌మాకా?

ఏడాదికో సినిమా.. లేదంటే రెండు మూడేళ్ల‌కో సినిమా.. ఇలా ఉంటుంది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చే సినిమాల ప‌రిస్థితి. అలాంటి త్రివిక్ర‌మ్ వ‌చ్చే ఏడాది త‌న అభిమాల‌కు, ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజింగ్ షాక్ ఇవ్వ‌నున్నారా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్‌లో. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం త్రి

'రంగ‌స్థ‌లం' కొత్త డేట్‌..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తొలి చిత్రం 'రంగ‌స్థ‌లం'. అక్కినేని స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ ప్ర‌త్యేక గీతంలో ఆడిపాడ‌నుంది.