'విమానం' అందరి కథే.. జీఎంఆర్ జీవితంలోనూ, ఆ కలే నేటి ఎయిర్‌పోర్ట్స్: కే. రాఘవేంద్రరావు ఎమోషనల్

  • IndiaGlitz, [Sunday,June 04 2023]

శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్కస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘‘విమానం’’. విలక్షణ నటుడు , దర్శకుడు సముద్రఖని ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. అనసూయ, మీరా జాస్మిన్, రాజేంద్రన్ , ధనరాజ్‌, రాహుల్ రామకృష్ణ, మాస్టర్ ధ్రువన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన విమానం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బస్తీలో వుండే అంగవైకల్యంతో బాధపడే తండ్రి, అతని కొడుకు విమానం ఎక్కాలనే కల ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

కథ చెబుతుంటే కంటి వెంట నీళ్లు :

తాజాగా చిత్ర బృందాన్ని దిగ్గజ దర్శకుడు కే.రాఘవేంద్రరావు అభినందించారు. విమానం ట్రైలర్ చూశానని.. చిన్న సినిమా అయినప్పటికీ ఎంతో ఎమోషన్ వుందన్నారు. జీ ప్రసాద్ ఎందుకు ఈ కథను తీసుకున్నారో తర్వాత అర్ధమైందన్నారు. ట్రైలర్ ఎంతో హార్ట్ టచింగ్‌ వుందని, సినిమా గురించి చెబుతున్నప్పుడు తన కళ్లు చెమ్మగిల్లాయన్ని రాఘవేంద్రరావు అన్నారు. ఇలాంటి చిన్న సినిమాలను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆదరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి సినిమాలను చూపించాల్సిన ఆవశ్యత ఎంతో వుందని రాఘవేంద్రరావు సూచించారు. తన కొడుకుని విమానం ఎక్కించేందుకు తండ్రి పడే తాపత్రయాన్ని ఆవిష్కరించడమే కాకుండా, మిగిలిన పాత్రలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన ప్రశంసించారు. జీ స్టూడియోస్ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు తీయాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్‌కు రాఘవేంద్రరావు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

భార్య కోసం విస్పాపై వైజాగ్‌కి :

ఇక ఇదే సమయంలో విమానం ఎక్కాలన్నది ఎంతోమంది కల అని చెబుతూ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లిఖార్జున రావు జీవితంలో జరిగిన సంఘటనను దర్శకేంద్రుడు పంచుకున్నారు. జీఎంఆర్‌కు పెళ్లయిన కొత్తలో ఆయన సతీమణి విమానం చూడాలని ముచ్చటపడ్డారని తెలిపారు. దీంతో భార్య కోరిక తీర్చడం కోసం ఆయన తనకున్న విస్పా మీద రాజాం నుంచి విశాఖ విమానాశ్రయానికి వచ్చి అక్కడికి దగ్గరలో వున్న గోడపై నుంచి విమానం చూపించారని రాఘవేంద్రరావు గుర్తుచేశారు. అలాంటి జీఎంఆర్ ఇప్పుడు భారతదేశంతో పాటు ఎన్నో దేశాల్లో గొప్ప గొప్ప విమానాశ్రయాలను నిర్మించారని ఆయన ప్రశంసించారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఒక ఎమోషన్ నింపితే పెద్దయ్యాక గొప్ప విజయాలు సాధిస్తారని రాఘవేంద్రరావు తెలిపారు.

More News

Anasuya Bharadwaj: పెళ్లి రోజున భర్తతో కలిసి థాయ్ బీచ్‌లో రంగమ్మత్త.. వైట్ బికినీలో మామూలగా లేదుగా

న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. యాంకర్‌గా, నటిగా ఎదిగారు అనసూయ భరద్వాజ్. తెలుగులో డిమాండ్ వున్న నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.

Chiranjeevi: ఫ్యాన్స్, సినీ కార్మికులకు క్యాన్సర్ టెస్టులు.. ఎన్ని కోట్లయినా ఇస్తా: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా

Chiranjeevi: నేనేం మాట్లాడాను, మీరేం రాశారు ?: మీడియాపై చిరంజీవి గుస్సా

మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ బారినపడ్డారంటూ మీడియాలో వస్తున్న కథనాలు చిత్ర సీమలో కలకలం రేపాయి. ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవం

ఏపీలో తప్పిన రైలు ప్రమాదం.. గేట్‌మెన్ నిర్లక్ష్యం, ఈ లోకో పైలట్ నిజంగా దేవుడే

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది మరణించడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది.

Ram Charan: ఒడిషా రైలు ప్రమాదంపై రామ్ చరణ్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు సంతాపం

శుక్రవారం రాత్రి ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ ప్రజలను విషాదంలోకి నెట్టింది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఈ దారుణం జరిగింది.