ల‌క్కీ మంత్‌లో వ‌స్తున్న ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Friday,May 11 2018]

ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఈ పేరు విన‌గానే కుటుంబ‌స‌మేతంగా చూడ‌ద‌గ్గ ప్రేమ‌క‌థా చిత్రాలు క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడుతాయి. తొలిప్రేమ‌(1998)తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమైన క‌రుణాక‌ర‌న్‌.. తొలి సినిమాతోనే ఘ‌న‌విజ‌యం అందుకున్నారు. ఆ త‌రువాత కొన్ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా.. ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)తో మ‌రోసారి అందుకున్నారు.

ప‌దేళ్ళ గ్యాప్‌లో వ‌చ్చిన ఈ రెండు చిత్రాలు కూడా జూలై నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమాలు కావ‌డం విశేషం. క‌ట్ చేస్తే.. మ‌ళ్ళీ ప‌దేళ్ళ త‌రువాత అదే జూలై నెల‌లో త‌న కొత్త చిత్రం తేజ్ ఐ ల‌వ్ యుతో క‌రుణాక‌ర‌న్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నార‌ని వినిపిస్తోంది.

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌గా... క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18తో చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకోనున్న ఈ సినిమా.. జూలై ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ల‌క్కీ మంత్‌లో ఈ సారి కూడా క‌రుణాక‌ర‌న్ హిట్ అందుకుంటారేమో చూడాలి.

More News

నాగ‌ చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొచ్చింది

న‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' చిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

జూన్ 15న వస్తొన్న'దివ్యమణి' 

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్,  గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం 'దివ్య మణి'. ప్రముఖ యోగా గురు

ఎవెంజ‌ర్స్ ని గుర్తుచేసే 'సంజీవిని' టీజ‌ర్ విడుద‌ల‌

గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో , యాక్ష‌న్ తో అబ్బుర‌ప‌రిచాయంటే అది త‌ప్ప‌కుండా హాలీవుడ్ చిత్ర‌మే

నాలుగేళ్ళ త‌రువాత బాల‌య్య‌తో..

రెండుత‌రాల‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ విజ‌యాలు అందుకున్న సంగీత ద‌ర్శ‌కుల‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు.

ఫిదా విడుద‌లైన రోజునే..

ఫిదా.. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. వ‌రుణ్ తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా..