హిట్ కాంబోతో దిల్ రాజు...

  • IndiaGlitz, [Friday,October 20 2017]

హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న నిర్మాత దిల్‌రాజు ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

గ‌తంలో నిఖిల్‌తో 'కార్తికేయ‌'లాంటి సినిమా చేసిన చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంద‌ట‌. అయితే ప్ర‌స్తుతం నిఖిల్ కిరిక్ పార్టీ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. అలాగే, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌వ్య‌సాచి తెర‌కెక్కుతోంది. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే మ‌ళ్లీ ఈ హిట్ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.

దిల్‌రాజు కూడా నెక్ట్స్ మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లి సినిమా చేయ‌బోతున్నాడు. అంద‌రూ క‌మిట్‌మెంట్స్ పూర్తి కావాలంటే క‌చ్చితంగా ఏడాది స‌మ‌య‌మైతే ప‌డుతుంది. కాబట్టి ఈ సినిమా వ‌చ్చే ఏడాదే సెట్స్‌పైకి వెళుతుంద‌ట‌.

More News

వైజయంతీ మూవీస్ నాగార్జున, నానిల మల్టీస్టారర్

కథాబలం ఉన్న చిత్రాలకు, వెండి తెరపై భారీదనం కురిపించిన సినిమాలకు, స్టార్ వాల్యూ, మేకింగ్ వాల్యూల అరుదైన కలయికకు కేరాఫ్ అడ్రస్ వైజయంతీ మూవీస్ సంస్థ.

'రాజరథం' పోస్టర్ పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ కి కాపీ కాదు. ఇది ఒరిజినల్

నిరూప్భండారి, అవంతిక శెట్టి జంటగా తమిళ్ హీరో ఆర్య ప్రత్యేక పాత్రలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న డిఫరెంట్ మూవీ 'రాజరథం'. 'రంగితరంగ' వంటి సూపర్హిట్ చిత్రాన్ని రూపొందించిన అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్టీమ్అజయ్ రెడ్డి గొల్లపల్లి,

చిన్మయి చేతుల మీదుగా దృష్టి టీజర్ లాంఛ్

అందాల రాక్షసి, అలా ఎలా సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రాహుల్ రవీంద్రన్ కథానాయకుడిగా, ఎమ్ స్వేర్ బ్యానర్ పై రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దృష్టి.

క్రిస్మస్ కానుకగా నాని, సాయి పల్లవి ల 'ఎంసీఏ'

డబుల్ హ్యాట్రిక్ హీరో నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్నసినిమా `ఎంసీఏ`. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

శ్రీకారం చుట్టుకున్న'రుణం'

జీవితంలో ప్రతి మనిషి ఎవరికో ఒకరికి ఋణపడుతూ ఉంటాడు. అది గుర్తు పెట్టుకొని తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ మనిషిని ఎంత దూరం అయినా తీసుకువెళ్తుంది. ఒక్కోసారి అది జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది.