దిల్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఈమెనే.. ఫుల్ డీటైల్స్ ఇవీ..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదికగా ఈ వేడుక జరిగింది. అతి కొద్ది బంధువులు సమక్షంలో దిల్ రాజు పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఉదయం దిల్ రాజు ప్రకటన కూడా చేశారు. తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని.. తాజా మలుపుతో వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే దిల్‌రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు..? ఇంతకీ ఆమె తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తేనా కదా..? ఇంతకీ ఆమె ఏం పనిచేస్తుంది..? అనేదానిపై సినీ ప్రియులు, ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు.

ఇంతకీ ఎవరీమె..!?

మొదట ఎయిర్ హోస్టస్‌ను పెళ్లి చేసుకున్నాడని వార్తలు వినిపించాయ్.. ఆ తర్వాత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నట్లూ వార్తలొచ్చాయ్. ఇలా రకరకాలుగా పుకార్లు వస్తుండటంతో ఎట్టకేలకు దిల్ రాజ్ కాంపౌండ్ నుంచే వివరాలు బయటికి వచ్చాయి. ఆయన వివాహం చేసుకుంది తేజశ్వనీ అనే యువతిని. తేజశ్వనీ ఒరిజనల్ పేరు వైగా రెడ్డి అని వివరాలు బయటికొచ్చాయ్. కాగా.. దిల్ రాజు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్న విషయం విదితమే. ఆయన ఒరిజినల్ పేరు వి. వెంకట్రామిరెడ్డి. అంటే ఆయన పెళ్లి చేసుకున్నది కూడా అదే సామాజిక వర్గం అమ్మాయినే.. ఇదివరకు వచ్చిన పుకార్లన్నీ అబద్ధమే అన్న మాట. కాగా.. ఆ యువతి రాజుగారికి అత్యంత సన్నిహితుడైన ఓ మిత్రుడి సోదరి అని తెలిసింది. అయితే ఆమెకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయాల్లేవ్.

ప్రముఖుల విషెస్..!

వాస్తవానికి పెళ్లి అయిన కొన్ని గంటలకు గానీ.. దిల్ రాజు కాంపౌండ్ నుంచి సింగిల్ ఫొటో కూడా రిలీజ్ కాలేదు. అంతేకాదు.. ఆదివారం అర్ధరాత్రి పెళ్లయితే సోమవారం మధ్యాహ్నానికి ఫొటోలు విడుదల చేశారు. ప్రస్తుతం ఐదారు ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు రాజుగారికి విషెస్ చేశారు. అంతకు ముందు ఆయన కుమార్తె హన్సితా రెడ్డి కూడా విష్ చేసింది. ‘నాన్నా.. అన్ని సమయాల్లోనూ నువ్వు నాకు అతి పెద్ద బలంగా నిలిచావు. ఎప్పుడూ నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన కుటుంబ సంతోషమే నీకు అతి ముఖ్యమైనది. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజూ నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని హన్సితా రాసుకొచ్చింది.

రిసిప్షన్ ఎప్పుడో..!?

కేవలం 15 మంది మధ్యే పెళ్లి చేసుకున్న దిల్ రాజు.. రిసెప్షన్ ఎప్పుడు ఇస్తాడో.. తన సతీమణిని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, తన అత్యంత ఆప్తులకు.. మరీ ముఖ్యంగా మీడియాకు ఎప్పుడు పరిచయం చేస్తారా..? అని ఎంతో ఉత్సాహకంగా అభిమానులు వేచి చూస్తున్నారు. మరి కరోనా కష్టకాలం పోయిన తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఉంటుందా..? లేకుంటే సింపుల్‌గానే తన ఇంట్లో పెద్దలకు మాత్రమే ఫంక్షన్ ఉంటుందా..? అనేది తెలియరాలేదు.

More News

దిల్‌రాజు, ప్ర‌భాస్ చిత్రం... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా 'ఇట్స్ టైమ్ టు పార్టీ' ఫస్ట్ లుక్ విడుదల

బుల్లితెర రాములమ్మ, ప్రముఖ యాంకర్, 'బిగ్ బాస్ 3' ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం 'ఇట్స్ టైమ్ టు పార్టీ'. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సినీ థియేటర్స్ ఓపెన్ చేస్తే ‘సీన్’ మారుతుంది!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు.. థియేటర్స్ సర్వం బంద్ అయిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ 3.0లో చాలా సడలింపులు ఉన్నప్పటికీ థియేటర్స్‌ మాత్రం అందులో లేవ్.

గుడ్ న్యూస్ : ఈ నెల 12 నుంచి రైళ్లు నడుస్తాయ్..

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఎక్కడిక్కడ చిక్కుకున్న కార్మికులు, విద్యార్థులకు ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఒకింత శుభవార్తే చెప్పింది.

బాదుడే... బాదుడు.. జగన్ మార్క్ దోపిడీ: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్ల వర్షం కురిపించారు.