జెంటిల్ మ‌న్ నైజాం రైట్స్ ద‌క్కించుకున్న నిర్మాత‌

  • IndiaGlitz, [Saturday,May 21 2016]

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం జెంటిల్‌మ‌న్‌. ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అష్టా చమ్మా తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది. ఆదిత్య 369, వంశానికొక్కడు చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించిన జెంటిల్ మ‌న్ ఆడియోను రేపు (22న) విడుద‌ల చేస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...జెంటిల్ మ‌న్ నైజాం రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ద‌క్కించుకున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న జెంటిల్ మ‌న్ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.