బాల‌య్యతో వ‌ర్క‌వుట్ కాలేదు.. మ‌రి సుధీర్ బాబుకి?

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

వైవిధ్య‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన నిర్మాణ సంస్థ‌ల్లో శ్రీ‌దేవి మూవీస్ ఒక‌టి. ఆదిత్య 369, వంశానికొక్క‌డు వంటి విజ‌యంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన ఈ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌.. రెండేళ్ళ క్రితం విడుద‌లైన జెంటిల్ మ‌న్ (నాని ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం)తో చాన్నాళ్ళ త‌రువాత మ‌రో స‌క్సెస్‌ను చ‌విచూశారు.

ప్ర‌స్తుతం జెంటిల్ మ‌న్ ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌తోనే స‌మ్మోహ‌నం చిత్రం చేస్తున్నారు. సుధీర్ బాబు, అదితి రావ్ హైద‌రీ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం.. తాజాగా షూటింగ్‌ను కూడా పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ 15న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. స‌రిగ్గా 17 ఏళ్ళ క్రితం ఇదే తేదిన బాల‌కృష్ణ హీరోగా శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించిన భ‌లేవాడివి బాసూ కూడా విడుద‌లైంది. మ‌రి బాల‌య్య విష‌యంలో క‌లిసిరాని ఈ తేది.. సుధీర్ బాబుకైనా క‌లిసొస్తుందేమో చూడాలి.

More News

క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా

వారం గ్యాప్‌లో రెండు సోల్జ‌ర్ చిత్రాలు

దేశం కోసం ప్రాణత్యాగం చేయ‌డానికి కూడా వెనుకాడ‌ని ఆర్మీ ఆఫీస‌ర్ల క‌థ‌ల‌తో గ‌తంలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.

ర‌వితేజ 'డిస్కోరాజా'

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం నేల టిక్కెట్టు సినిమాతో మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేస్తున్నాడు.

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌..నో సీన్స్‌?

నాగ‌చైత‌న్య‌, స‌మంత.. ఆన్ ద‌ స్క్రీన్ మాత్ర‌మే కాదు.. ఆఫ్ ద‌ స్క్రీన్ కూడా మంచి జోడీ అనిపించుకున్నారు.

'లేడీ టైగర్' గా నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా మలయాళంలో మంచి విజయం సాధించిన "ఎలెక్ట్ర"