త్రివిక్రమ్ అన్నిసార్లు చెప్పాడా?

  • IndiaGlitz, [Tuesday,September 15 2015]

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అ...ఆ... అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' అని దానికి అర్థం. ఈ సినిమాను ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథను నితిన్ కు త్రివిక్రమ్ నాలుగు సార్లు చెప్పారట. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనగానే నితిన్ కథ కూడా వినకుండా ఓకే చెప్పేద్దామని అనుకున్నారట. కానీ కథ వినమని నాలుగు సార్లుచెప్పారట త్రివిక్రమ్. నితిన్ తో పాటు అతని టీమ్ అందరికీ త్రివిక్రమ్ కథను వినిపించారట. ఇష్క్ తరహాలో హీరో, హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండే సినిమా అని నితిన్ అన్నారు.

అనసూయ రామలింగం అంటే హీరోయిన్ కాదని, హీరో అత్త అనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. అత్తారింటికి దారేది తరహాలో మరలా అత్తా అల్లుళ్ళ సినిమాను తీస్తున్నారనీ టాక్ వినిపిస్తోంది. వచ్చే నెల్లో సెట్స్ మీదకు వెళ్ళే ఈ సినిమా సంక్రాంతికి రిలీజవుతుంది. ఈ చిత్రానికి సౌండ్ డిజైనర్స్ గా విష్ణు గోవింద్, శ్రీ శంకర్ పనిచేస్తారు. దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తారు. సినిమాటోగ్రఫి నటరాజ్ సుబ్రమణ్యన్, ఆర్ట్ రాజీవన్, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు ఇతర టెక్నీషియన్లు.

More News

ప‌వ‌న్ పై సెటైర్స్

నిన్న అన్న‌పూర్ణ సుంక‌ర‌...మ‌న డైరెక్ట‌ర్స్ కి సినిమాలు తీయ‌డం రాదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి బాగా పాపుల‌ర్ అయిపోయింది.

కామ‌న్ మేన్ ని హీరో చేసే.. కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్‌ : నితిన్

నితిన్, యామి గౌత‌మ్ జంట‌గా గౌత‌మ్ మీన‌న్ నిర్మించిన చిత్రం కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్‌. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ప్రేమ సాయి తెర‌కెక్కించారు.

'రెడ్ అలర్ట్'లో విఘ్నేశ్వరుడిపై సంస్కృత గీతం

ఏకకాలంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ... ఇలా నాలుగు భాషల్లో రూపొందిన ఘనతను దక్కించుకున్న చిత్రం 'రెడ్ అలర్ట్'.

'సిద్ధార్ధ'కి జోడీగా సాక్షీ చౌదరి

'పోటుగాడు', 'జేమ్స్ బాండ్' వంటి హిట్ చిత్రాల్లో నటించిన సాక్షీ చౌదరికి ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. మరోవైపు బాలీవుడ్ లో కూడా తను నటిస్తోంది.

మయూరి స‌ర్వం సిద్ధం

సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి., శ్రీ శుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు నిర్మిస్తున్న సినిమా మ‌యూరి.