'ధృవ' శాటిలైట్ హక్కులు...

  • IndiaGlitz, [Sunday,December 11 2016]

మెగాపవ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, రకుల్ జంట‌గా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ నిర్మాత‌లుగా రూపొందిన చిత్రం 'ధృవ‌'. డిసెంబ‌ర్ 9న విడుద‌లైన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్‌తో భారీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతుంది. మ‌గ‌ధీర త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో సినిమా రావ‌డం, సురేంద‌ర్ రెడ్డి టేకింగ్‌, మేకింగ్ సినిమాపై అంచాల‌ను పెంచాయి.

ఇప్పుడు సినిమా శాటిలైట్ హ‌క్కుల విష‌యంలో కూడా సినిమాకు భారీ ఆఫ‌ర్ వ‌చ్చింది. ప్రముఖ చానెల్ జెమిని టీవీవారు తొమ్మిదిన్న‌ర కోట్ల‌కు శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ట‌. తొలిరోజున ప‌దిన్న‌ర కోట్ల రూపాయ‌ల షేర్‌తో ధృవ స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఓవ‌ర్‌సీస్‌లో కూడా మిలియ‌న్ డాలర్ల దిశ‌గా ర‌న్ అవుతుంది.