దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్రంతో..ధ‌న‌రాజ్ ఏ పాత్ర అయినా బాగా చేస్తాడ‌నే మంచి పేరొస్తుంది - ధ‌న‌రాజ్‌

  • IndiaGlitz, [Monday,November 13 2017]

యశ్వంత్ మూవీస్ సమర్పణలో, ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్నచిత్రం 'దేవిశ్రీప్రసాద్'. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మ‌నోజ్ నందం ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మాతలు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ..

ధనరాజ్ మాట్లాడుతూ "ఈ సి నిమాలో హీరోయిన్ పూజా రామచంద్రన్ మెయిన్ రోల్ చేసింది. నేను, భూపాల్, మనోజ్ నందం..ముగ్గురం ప్రధాన పాత్రల్లో నటించాం. దేవి అనే పాత్రలో భూపాల్, ప్రసాద్ పాత్రలో మనోజ్ నందం నటిస్తే, నేను శ్రీ అనే పా త్రలో కనపడతాను. పూజా రామచంద్రన్ కంటే ముందు దాదాపు పదమూడు మంది హీరోయిన్స్‌ను కలిసి కథ చెబితే..వాళ్లు నటించమని చెప్పేశారు.

కానీ పూజా రామచంద్రన్‌కథ వినగానే యాక్ట్ చేయడానికి అంగీకరించింది. సినిమాలో పూజా రామచంద్రన్ పేరు లీలా రామచంద్రన్. తను ఇందులో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సినిమా అంతా ఆరు క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. ఈ మధ్య సినిమా ప్రీమియర్ చూసిన తరుణ్, ప్రిన్స్ తదితరులు సినిమాను వ్యక్తిగతంగా ప్రమోట్ చేస్తామని చెప్పారు. సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో చేశాం.

నా క్యాఎక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే.. నాది మార్చురీ వ్యాన్ డ్రైవ‌ర్‌గా క‌న‌ప‌డ‌తాను. సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూసిన వారందరూ ఇదొక వల్గర్ సినిమా, శవాన్ని రేప్ చేయడం ఏంటి? అని అన్నారు. కానీ సినిమా చూస్తే వల్గారిటీ ఎక్కడా కనపడదు. ఇది యూత్ సినిమాయే.. కానీ బూతు సినిమా కాదు.

దర్శకుడు శ్రీకిషోర్ చాలా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాడు. త‌ను లేకుండా ఈ సినిమాను ఊహించ‌లేం. సినిమాను 15-20 రోజుల్లో పర్‌ఫెక్ట్ ప్లానిం గ్‌తో తెరకెక్కించేశాడు. ఎనభై శాతం సినిమా మార్చురీ గదిలోనే షూట్ చేశారు. ముందు వేర్వేరు టైటిల్స్ అనుకున్ననప్పటికీ..చివరకు దేవిశ్రీ ప్రసాద్ టైటిల్ అయితే బావుంటుందని దాన్నే పెట్టాం. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌గారి పేరు పెట్టుకున్న తర్వాత మా సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అలాగని మేమెక్కడా ఆయన పేరుని మిస్ యూజ్ చేయలేదు. ఈ శుక్రవారం నేను నటించిన 'లండన్ బాబులు', 'దేవిశ్రీప్రసాద్' సినిమాలు విడుదలవుతున్నాయి. లండన్ బాబులు చిత్రంలో నాది ఎమోషనల్ పాత్ర. అలాగే..దేవిశ్రీ ప్రసాద్ చిత్రం చూస్తే, ధనరాజ్ ఏ పాత్ర అయినా చేస్తాడని పేరొస్తుంది" అన్నారు.

More News

మాల్స్‌లో నా పేరు సూర్య‌

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ త‌రువాత అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం నాపేరు సూర్య‌. నా ఇల్లు ఇండియా అనేది దీనికి ట్యాగ్‌లైన్‌. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు.

అల్లు శిరీష్‌ షూటింగ్‌లో ప‌వ‌ర్‌స్టార్‌

త‌న గ‌త చిత్రం శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు అల్లు వారి క‌థానాయ‌కుడు అల్లు శిరీష్.  ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క క్ష‌ణం చేస్తున్నాడు.

నాగ్‌,వ‌ర్మ చిత్రంలో అమితాబ్?

24 ఏళ్ల త‌రువాత కింగ్ నాగార్జున‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 20 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాని ఏప్రిల్ 20న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది

అప్పుడు లెక్చ‌ర‌ర్‌.. ఇప్పుడు ప్రొఫెస‌ర్‌

25 ఏళ్ల క్రితం కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సుంద‌ర‌కాండ‌లో లెక్చ‌ర‌ర్‌గా విక్ట‌రీ వెంక‌టేష్ చేసిన సంద‌డి అంత సులువుగా మ‌ర‌చిపోలేం. ఘ‌న‌విజ‌యం సాధించిన ఆ చిత్రంతో వెంక‌టేష్ కి న‌టుడిగా మరింత గుర్తింపు వ‌చ్చింది.

ఫైన‌లైజ్ చేయ‌లేద‌న్న అనిల్‌

ప‌టాస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మయ్యాడు అనిల్ రావిపూడి. ఆ త‌రువాత సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల స‌క్సెస్‌తో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు.